ప్రాకృత వాఙ్మయంలో రామకథ (పుస్తకం)

(ప్రాకృత వాజ్ఞమయంలో రామ కథ: పుస్థకం నుండి దారిమార్పు చెందింది)

ప్రాకృత వాఙ్మయంలో రామకథ తిరుమల రామచంద్ర రాసిన పుస్తకం. రచయిత భాషా శాస్త్రం పట్ల వైజ్ఞానిక దృక్పథంతో భారతి పత్రికలోనూ, మరికొన్ని సందర్భాలలోనూ రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. “జనని సంస్కృతంబు సకల భాషలకును” అన్న వాదన అశాస్త్రీయమని, భాషా శాస్త్రం విషయంలో అనులోమ, ప్రతిలోమాలు సహజమని రచయిత ఈ పుస్తకంలో ప్రస్తావిస్తాడు.

వ్యాసాలు మార్చు

ఈ పుస్తకంలో 9 వ్యాసాలు ఉన్నాయి. అవి

  • ప్రాకృత వాఙ్మయంలో రామకథ : ఇది 1977 మే నెలలో వైట్ ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి కళాశాల ఏర్పాటు చేసిన "రామాయణ సుధా లహరి" సదస్సులో చదివిన పత్రం ఈ వ్యాసం.[1]
  • వజ్జాలగ్గంలో తెలుగు పదాలు
  • ప్రాకృత ప్రకృతి
  • తెలుగు ప్రాకృతాల సంబంధం
  • అపభ్రంశ వాఙ్మయ పరిచయం
  • తెలుగు దేశంలోని బౌద్ధ శాఖలు
  • బౌద్ధ సాహిత్యం : ఆంధ్ర బౌద్ధాచార్యులు
  • జిన వల్లభుడి మహావీర స్వామి స్తోత్రం
  • దేశీ నామమాలలోని తెలుగు పదాలు

పుస్తకం గురించి మార్చు

రచన: డా: తిరుమల రామ చంద్ర:, ప్రచురణ:సంఖ్య: 5, ప్రాకృత అకాడమి, ప్రథమ ముద్రణ: 1992, ప్రతులకు:.... పాకృత అకాడెమి:, బరోడా బ్యాంకు కాలని, న్యూబాకారం, హైదరాబాదు.,విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, బ్యాంకు స్త్రీటు, హైదరాబాదు. ధర: రూ.30/-

మూలాలు మార్చు

  1. "తిరుమల రామచంద్ర ఆధ్యాత్మిక రచనలు Tirumala Ramachandra Aadhyatmika Rachanalu | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-27. Retrieved 2021-04-15.

బాహ్య లంకెలు మార్చు