ఫిలిప్ గుణవర్ధనే

డాన్ ఫిలిప్ రూపసింఘే గుణవర్ధనే (1901 జనవరి 11 - 1972 మార్చి 26) శ్రీలంక మార్క్సిస్ట్ రాజకీయ నాయకుడు, వామపక్షవాది. ట్రోత్స్కీయిజం(Trotskyism) ప్రవేశపెట్టినందుకు ప్రసిద్ధి చెందిన సిలోన్‌లోని మొదటి రాజకీయ పార్టీ అయిన లంకా సమసమాజ పార్టీ స్థాపకుడు, తరువాత అతను మహాజన ఎక్సత్ పెరమునను స్థాపించాడు. ఆయనని 'సోషలిజం పితామహుడు', 'బోరలుగోడ సింహం' అని అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. ఆయన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సిలోన్, సిలోన్ పార్లమెంటు సభ్యుడుగా విధులు నిర్వర్తించాడు. అతను 1956 నుండి 1959 వరకు ఎస్. డబ్ల్యూ. ఆర్. డి. బండారునాయకే ఆధ్వర్యంలో వ్యవసాయం, ఆహార మంత్రిగా చేశారు. అలాగే 1965 నుండి 1970 వరకు డడ్లీ సేనానాయక ఆధ్వర్యంలో జాతీయ ప్రభుత్వంలో పరిశ్రమలు, మత్స్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

ది హానరబుల్
డాన్ ఫిలిప్ రూపసింఘే గుణవర్ధనే
మత్స్య, పరిశ్రమల మంత్రి
In office
1965–1970
చక్రవర్తిఎలిజబెత్ II
ప్రథాన మంత్రిడడ్లీ సేనానాయక
అంతకు ముందు వారుడబ్ల్యూ. జె. సి. మునసింహ
తరువాత వారుజార్జ్ రాజపక్స
వ్యవసాయం, ఆహార మంత్రి
In office
1956–1959
చక్రవర్తిఎలిజబెత్ II
ప్రథాన మంత్రిఎస్. డబ్ల్యూ. ఆర్. డి. బండారునాయకే
అంతకు ముందు వారుజె. ఆర్. జయవర్ధనే
తరువాత వారుసి. పి. డి సిల్వా
Member of the Silon Parliament
for అవిస్సావెల్లా
In office
1956–1970
అంతకు ముందు వారుకుసుమసిరి గుణవర్దనే
తరువాత వారుబోనీ జయసూర్య
In office
1947–1947
తరువాత వారుకుసుమసిరి గుణవర్దనే
వ్యక్తిగత వివరాలు
జననం(1901-01-11)1901 జనవరి 11
బోరలుగూడ, అవిస్సావెల్ల, బ్రిటిష్ సిలోన్
మరణం1972 మార్చి 26(1972-03-26) (వయసు 71)
కొలంబో, డొమినియన్ ఆఫ్ సిలోన్
జాతీయతశ్రీలంకన్
రాజకీయ పార్టీమహాజన ఏకత్ పెరమున
ఇతర రాజకీయ
పదవులు
లంక సమసమాజ పార్టీ
జీవిత భాగస్వామికుసుమ అమరసింహ
సంతానంఇందిక గుణవర్దనే,
ప్రసన్న గుణవర్దనే,
లక్మాలి గుణవర్దనే,
దినేష్ గుణవర్దనే,
గీతాంజనా గుణవర్దనే
కళాశాలఆనంద కళాశాల
కొలంబో విశ్వవిద్యాలయం
ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకుడు

ఆయన కుమారుడు దినేష్‌ గుణవర్ధనే శ్రీలంక 15వ ప్రధానమంత్రిగా 2022 జులై 22న పదవీప్రమాణం చేశారు.[1]

వ్యక్తిగత జీవితం మార్చు

ఫిలిప్ గుణవర్ధనే 1901 జనవరి 11న హేవగాం కోరలేలోని అవిస్సావెల్లాలోని బోరలుగూడ ​​గ్రామంలో జన్మించారు. అతని తల్లి సియన కోరలేలోని దోంపేకి చెందిన డోనా లియనోర గుణశేఖర. అతని తండ్రి డాన్ జాకోలిస్ రూపసింఘే గుణవర్దనే. అతను బోరలుగోడ రాలహామి అని పిలువబడే స్థానిక భూస్వామి. అతను 1915 సింహళీ-ముస్లిం అల్లర్ల సమయంలో వైవాహిక చట్టం ప్రకారం జైలులో మరణశిక్ష విధించబడే వరకు గ్రామ పెద్ద (రాళహామి) విదానే ఆరాచ్చిగా పనిచేశాడు. ఆయన భార్య పిటిషన్‌పై గవర్నర్‌ వెనక్కి తీసుకున్నారు. అతను ముగ్గురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలతో కూడిన కుటుంబంలో మూడవ సంతానం. ఇందులో రాబర్ట్ గుణవర్దనే, కరోలిన్ ఆంథోనిపిళ్లై వామపక్ష రాజకీయ నాయకులుగా మారారు.

ఫిలిప్ గుణవర్దనే 1939లో కుసుమ అమరసింహను వివాహం చేసుకున్నాడు, ఆమె 1948-1960 మధ్య పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసింది. వారికి ఐదుగురు సంతానం. వారు మాజీ క్యాబినెట్ మంత్రి ఇందిక గుణవర్దనే, కొలంబో మాజీ మేయర్ ప్రసన్న గుణవర్దనే, సాహిత్యంలో రాష్ట్ర అవార్డు గ్రహీత లక్మాలి గుణవర్దనే, ప్రస్తుత శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్దనే, మాజీ మంత్రి గీతాంజనా గుణవర్దనే.

అతని మేనకోడలు వివియన్నే గూనెవర్ధనే ఎల్.ఎస్.ఎస్.పి మరొక వ్యవస్థాపకుడు లెస్లీ గుణవర్దనేని వివాహం చేసుకుంది. అతని మనవడు యాదమిని గుణవర్దనే శ్రీలంక పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ నుండి పార్లమెంటుకు నియమితులయ్యాడు.

చదువు మార్చు

ఫిలిప్ గుణవర్ధనే ప్రాథమిక విద్య స్థానికంగా బోరలుగోడ దేవాలయం, సిద్ధార్థ విద్యాలయ, కలుఅగ్గలలో జరిగింది. తన మాధ్యమిక విద్య కొలంబోలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కళాశాల, మొరటువా, ఆనంద కళాశాలలో పూర్తిచేసాడు. ఆనంద కళాశాలలో చదువుతున్నప్పుడు, అతను టి. బి. జయ ఇంట్లో ఉండేవాడు. ఆయన లండన్ మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించడానికి కొలంబోలోని యూనివర్శిటీ కాలేజీలో ప్రవేశించాడు. అప్పుడే సిలోన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరాడు, కానీ యంగ్ లంక లీగ్ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యాడు.

భారత స్వాతంత్ర్యోద్యమంలో మార్చు

ఫిలిప్ గుణవర్ధనే సామ్రాజ్యవాదానికి, వలస వాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇందులో భాగంగా భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ కీలకపాత్ర పోషించాడు. లండన్ లో చదువుకునే సమయంలోనే ఆయనకు జవహర్ లాల్ నెహ్రూ, జోమో కెన్యట్టా (కెన్యా) వంటి అంతర్జాతీయ స్వాతంత్ర్య పోరాట యోధులతో పరిచయం ఏర్పడింది. తదనంతర కాలంలో ఆయన నెహ్రూ, కృష్ణమీనన్ వంటి నేతలతో కలిసి సామ్రాజ్యవాద వ్యతిరేక ఇండియన్ లీగ్ కోసం పనిచేశారు. అంతేకాదు, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణన్ తోనూ సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. ఆయన 1942లో భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుపాలు అయ్యాడు. 1943లో ఆయనను శ్రీలంక తరలించి ఆర్నెల్ల పాటు ఖైదు చేశారు. ఆయన 1972 మార్చి 26న మరణించాడు.

మూలాలు మార్చు

  1. "శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్ధనే: ప్రమాణం చేసిన కొత్త పీఎం". web.archive.org. 2022-07-23. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)