బషీరుద్దీన్ ముహమ్మద్

బషీరుద్దీన్‌ ముహమ్మద్‌ గేయ రచయిత. వీరు ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు ప్రచురింపబడ్డాయి.

బాల్యము మార్చు

నల్గొండ జిల్లా మర్యాలలో 1931 జనవరి 5న జన్మించారు.

  • తల్లిదండ్రులు ఖైరాతున్నీసా, ఎం.డి జలాలుద్దీన్‌
  • కలంపేరు: ఘామడ్‌ నల్గొండవి
  • చదువు: మెట్రిక్‌
  • ఉద్యోగం: జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగము చేసి పదవీ విరమణ పొందారు

రచనా వ్యాసంగము మార్చు

వీరు రచనా వ్యాసంగం 1970 లో ఆరంభించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి. లోక గీతాలు పేరున(2008)వీరు వ్రాసిన పాటలు ప్రచురితమయ్యాయి. వీరి లక్ష్యం ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం.