బి. రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన బి రామకృష్ణారెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించారు[1]. 73వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 2023 జనవరి 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి సాహిత్యం - విద్యా విభాగంలో రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది[2]. గిరిజన భాషలైన కువి, మండలపై రామకృష్ణారెడ్డి విస్తృత పరిశోధన చేశారు[3]. గిరిజన భాషలను కూడా అధికార భాషలుగా గుర్తించాలన్నారు[4]. దేశంలో 200 భాషలు ఉంటే అందులో 50 వరకు గిరిజన భాషలు ఉన్నాయని తెలిపారు. మైసూర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ( సి ఐ ఐ ఎల్ ) లో పనిచేస్తున్నప్పటి నుండి ఆయన గిరిజన భాషల పై పరిశోధన చేయడం ప్రారంభించారు[5].

మూలాలు మార్చు

  1. "Padma awards 2023: తెలుగింట 'పద్మా'ల పంట". EENADU. Retrieved 2023-09-04.
  2. Desk, HT Telugu. "Padma Awards 2023: చినజీయర్‌కు పద్మభూషణ్.. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు వీరికే". Hindustantimes Telugu. Retrieved 2023-09-04.
  3. "Padma Awards 2023 : 'పద్మ' అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఈ సారి తెలుగు తేజాలకు." Sakshi Education. Retrieved 2023-09-04.
  4. "రాష్ట్రం నుంచి ఐదుగురికి 'పద్మ' పురస్కారాలు.. ఇదే వారి నేపథ్యం". ETV Bharat News. Retrieved 2023-09-04.
  5. Telugu, 10TV; naveen (2023-01-25). "Padma Awards 2023 : పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు పద్మాలు వీరే". 10TV Telugu (in Telugu). Retrieved 2023-09-04.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)