భగవద్గీతా ఫౌండేషన్

(భగవద్గీత ఫౌండేషన్ నుండి దారిమార్పు చెందింది)

భగవద్గీత ఫౌండేషన్ భగవద్గీతను విశ్వవ్యాప్తం చేయడానికి స్థాపించిన  లాభాపేక్ష లేని ఒక ధార్మిక సంస్థ. గీత నేర్చుకుందాం - రాత మార్చుకుదాం - ఇంటిటా గీతా జ్యోతిని వెలిగిద్దాం' అనేది ఈ ఫౌండేషన్ నినాదం.[1]

భగవద్గీత ఫౌండేషన్
వ్యవస్థాపకులుగంగాధర శాస్త్రి ఎల్.వి
కార్యస్థానం
  • బంజారాహిల్స్, హైదారాబాద్, భారతదేశం.
జాలగూడుhttp://www.bhagavadgitafoundation.org/contactus.html

స్థాపన మార్చు

ఈ ఫౌండేషన్ ను ప్రముఖ గాయకుడు ఎల్.వి గంగాధర శాస్త్రి 5 మార్చి 2007 రోజున స్థాపించారు.

కార్యక్రమాలు మార్చు

భగవద్గీత సంస్థ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి సంపూర్ణ భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను తెలుగులో తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంతో గానం చేసి, రికార్డు చేసి తన జీవితాన్ని గీతా ప్రచారానికి అర్పించాడు.

గంగాధర శాస్త్రి భగవద్గీత మార్చు

  • భగవద్గీతకు భారతదేశంలో, గాన పద్ధతిలో ప్రచారం కల్పించినవాడు తెలుగువాడు (ఘంటసాల) కాబట్టి, భగవద్గీతను సంపూర్ణంగా గానం చేసేవాడు కూడా తెలుగువాడే కావాలన్న లక్ష్యంతో ఘంటసాల భగవద్గీత స్ఫూర్తితోప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి- భగవద్గీతలోని 700 శ్లోకాలనూ తాత్పర్య సహితంగా గానం చేయడానికి సంకల్పించాడు.
  • ఈ సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం 2006 జూన్ 25న, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి చేతుల మీదుగా హైదరాబాదులోని అన్నా ఆడియో లాబ్‍లో ప్రారంభమై, 6 సంవత్సరాల కృషి అనంతరం , 2012లో పూర్తయ్యింది.
  • శ్రీ ఘంటసాల గౌరవార్థం, ఆయన పాడిన 106 శ్లోకాలను యథాతథంగా గానం చేస్తూ, మిగిలిన శ్లోకాలను గంగాధర శాస్ర్తి స్వీయ సంగీతంలో గానం చేసి 700 శ్లోకాల ’భగవద్గీత’ను సంపూర్ణంగా రికార్డు చేసాడు.
  • పద్మశ్రీ ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృతమిత్ర డా||ఆర్.వి.ఎస్.ఎస్.అవధానులు, ఆచార్య శ్రీ కోరాడ సుబ్రహ్మణ్యంల పర్యవేక్షణలో ప్రామాణిక స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
  • ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక విలువలతో డిజిటల్ స్టీరియో రికార్డింగ్‍లోను, ’డాల్బీ డిజిటల్ 5.1’ ఛానల్‍లోను మిక్సింగ్ చేయడం ఈ ’భగవద్గీత’ ప్రత్యేకత.
  • ఘంటసాల ’భగవద్గీత’కు పనిచేసిన ’సితార్’ వాద్యకాళాకారుడుశ్రీ జనార్దన్, సౌండ్ ఇంజనీర్’హెచ్.ఎమ్.వి’.రఘు, సంగీత దర్శకులుశ్రీ సంగీతరావు ఈ ప్రాజెక్టుకు కూడా గౌరవహోదాల్లో పనిచేయడం విశేషం.
  • కర్నాటక శాస్ర్తీయ, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ ’భగవద్గీత’ శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్ళేట్టుగా సాగుతుంది.
  • శ్రీ కృష్టార్జున సంవాదాన్ని కళ్ళకు కట్టినట్టుగా వినిపించేందుకు అనుగుణమైన సంగీతం, సౌండ్ఎఫెక్ట్స్ ఈ ’భగవద్గీత’లో ప్రత్యేక ఆకర్షణ. అలాగే ’భగవద్గీత’లో కనిపించే శ్రీకృష్టుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్టుడు పాత్రలకు తగినట్టుగా శ్లోకాలను, తాత్పర్యాలను భావప్రధానంగా పాడుతూ పఠించడం మరో విశేషం.
  • ’భగవద్గీతా’ గానానికి ప్రారంభంలో ఉపోద్ఘాతము, 18 అధ్యాయాలకు ముందు ఆయా అధ్యాయాలలోని ప్రధానాంశాల ప్రస్తావన, అధ్యాయం ప్రారంభంలో థీమ్ మ్యూజిక్, ప్రతి అధ్యాయం చివరన’కృష్టభజన’ఈ ’భగవద్గీత’రికార్డింగులో ఉన్నాయి.
  • ’భగవద్గీత’ను తెలుగు భాషతో పాటుహింది, ఇంగ్లీషు, జర్మన్, రష్యన్, ఫ్రెంచ్, జపనీస్మొదలైన అంతర్జాతీయ భాషలలో కూడా అనువదించి, ఆడియో సీడీలుగా విడుదల చేయడానికి, విస్తృత ప్రచారం చేయడానికి ఈ ఫౌండేషన్ సంకల్పించింది.[2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "గాయకుడు గంగాధర శాస్త్రి 'భగవద్గీత ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'గీతా జయంతి' వేడుకలు". indiaglitz.com. indiaglitz. Retrieved 12 December 2016.
  2. "భాగవద్గీతా ఫౌండేషన్ జాలగుడు". భగవద్గీత ఫౌండేషన్. Archived from the original on 2022-01-06. Retrieved 2022-01-06.