భుజించినప్పుడు వచ్చే ఆయాసంను భుక్తాయాసం అంటారు. పరిమితికి మించి భోజనం భుజించడం వలన ఎక్కువ ఆయాసం వస్తుంది. భోజనం కడుపునిండా తిని తరువాత మంచినీరును త్రాగటం వలన ఊపిరితిత్తులపై బరువు పడుతుంది, తద్వారా ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచించి గాలిని పీల్చలేవు, ఈ విధంగా ఊపిరితిత్తులపై పడిన భారం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, ఆయాసం వస్తుంది. రుచి కరమైన ఆహార పదార్థాలను ఇష్టంగా అమితంగా తినే సంబర్భాలలో ఇది సంభవిస్తుంది. అందువలన తినేటప్పుడు మితంగా అవసరమైనంతవరకే భోజనం చేయాలి. రుచిగా ఉందని మోతాదుకు మించి తినకూడదు. తిన్న భోజనం జీర్ణమయ్యేందుకు ఊపిరితిత్తుల ద్వారా గాలిని తీసుకోవలసివుంటుంది. అందువలన భోజనం తినేటప్పుడు నేలపై కూర్చొని తినాలి. నేలపై కూర్చునప్పుడు పొట్ట కొంతభాగం మూసుకుపోతుంది. అప్పుడు కడుపునిండా తిన్నప్పటికి నేలపై కూర్చున్నప్పుడు మూసుకుపోయిన పొట్ట ఖాళీగా ఉండి లేచినప్పుడు శ్వాస బాగా అందుతుంది, భుక్తాయాసమూ తగ్గుతుంది.

భుక్తాయాసం తగ్గడానికి మార్చు

మితంగా భోజనం చేయటం. అన్నం తినేటప్పుడు సగం కడుపుకే అన్నం తిని కాలు భాగం నీరు తాగి కాలు భాగం ఖాళీగా ఉంచాలని పెద్దలు చెబుతుంటారు. మితంగా భోజనం భుజించటం వలన ఊపిరితిత్తులపై భారం తగ్గి ఆహారం ఆరగడానికి అవసరమయిన గాలిని సాఫీగా అందించగలుగుతాయి.

ఇవి కూడా చూడండి మార్చు

త్రేన్పు

బయటి లింకులు మార్చు