'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అప్పటినుండి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమవుతుంది[1]. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రజలతో పంచుకుంటారు[2]. ఈ కార్యక్రమాన్ని ప్రతినెల 23 జాతీయ భాషలు, 31 మండలి కాళ్లు అన్ని కేంద్రాల ద్వారా ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. అలాగే ఇంగ్లీష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ఇది ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నాటినుంచి 2022 అక్టోబర్ వరకు మన్ కీ బాత్ ద్వారా ప్రసార భారతికి 33.16 కోట్ల ఆదాయం వచ్చింది. 2023 ఏప్రిల్ 30వ తేదీతో మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది[3]. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. సామాన్యులతో అనుసంధానానికి, ప్రజల్లోని భావ తీగలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు[4]. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందని చెప్పారు.

మూలాలు :

  1. "Mann Ki Baat", Wikipedia (in ఇంగ్లీష్), 2023-05-30, retrieved 2023-06-28
  2. "Mann Ki Baat | Prime Minister of India". www.pmindia.gov.in. Retrieved 2023-06-28.
  3. "PM Modi's Mann Ki Baat to go global with 100th episode today". The Hindu (in Indian English). 2023-04-30. ISSN 0971-751X. Retrieved 2023-06-28.
  4. "PM Narendra Modi's 'Mann ki Baat' 100th episode: Key points". The Times of India. 2023-04-30. ISSN 0971-8257. Retrieved 2023-06-28.