మమ్మటుడు

సంస్కృత పండితుడు

మమ్మటుడు, పరిష్కార యుగం యొక్క తొలి అలంకార గ్రంథకర్త. ఇతను గొప్ప వ్యాకరణవేత్త అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన తన రచనలో అనేకసార్లు మహాభాష్యం యొక్క విషయాలను ప్రస్తావించారు. మమ్మటుడు కావ్యప్రకాశము, శబ్దవ్యాపారవిచారము అనే ప్రఖ్యాత గ్రంథాలను రచించాడు. ఇతను 11వ శతాబ్దానికి చెందినవాడని కొన్ని ఆధారముల ద్వారా తెలియుచున్నది.

జీవిత విశేషములు మార్చు

ఈ కావ్యప్రకాశము ప్రచురణకర్త అయిన మమ్మటుడు కాలం అందుబాటులో లేనప్పటికీ, ఆతని కాలం గురుంచి చాలా బలంగా ఊహించబడిన విషయం ప్రాచుర్యంలో ఉంది. కాశ్మీర పండితులైన ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు వంటి రచనలకు టీకాలు వ్రాసిన ఇతర గ్రంథాలలో మమ్మటుడి ప్రస్తావన కలదందున ఇతను సుమారు 11వ శతాబ్దానికి చెందిన కాశ్మీర రచయిత అని నిరూపించబడింది.

కావ్యప్రకాశ గ్రంథకర్త అయిన మమ్మటాచార్యుడు రాజనాక అనే బ్రాహ్మణ కుటుంబంలో కాశ్మీర పురంలో జన్మించాడు. అప్పటికే అనేక కాలం నాటి దీర్ఘకాల దోషాలతో కూడిన అలంకార గ్రంథాలను పరిష్కరించి తన కావ్యప్రకాశాన్ని రచించి, అనేక ధ్వని సంబంధించిన విషయాలను సంకలనం చేసి, లెక్కించాడు, వాటిని తగిన విధంగా సమ్మేళనం వ్యాసాలలో అమర్చాడు. పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని కారకా శబ్దాల రూపాలను విశదీపరిచాడు. ఏవిధంగా అయితే శబ్దార్ధపరిశుద్ధి కొరకు, సూత్రవివరణ కొరకు సిద్ధాంతకౌముది విభజించబడినదో అదేవిధంగా మమ్మటుడు తన కావ్యప్రకాశాన్ని విభజించాడు.

కావ్యప్రకాశము వ్యాఖ్యానములు మార్చు

దీని వ్యాఖ్యానాలు, రచయితలు -

  1. సంకేతము ---- జైన మాణిక్య చంద్రాచార్యులచే రచించబడినది.
  2. బాలచిత్తానురంజని.. సరస్వతీ తీర్ధులచే రచించబడినది
  3. దీపికా ... ... ... జయంత్ భట్టాచార్యుడు.
  4. ఆదర్శ సంకేతము ... సోమేశ్వర్ భట్ట.
  5. దర్పణము ... ... ... విశ్వనాథ కవిరాజు.
  6. విస్తరికా... ... పరమానంద్ – చక్రవర్తి – భట్టాచార్య.
  7. నిదర్శనము (సారాంశాల సంకలనం) -- రాజనాకానంద కవులు.
  8. శరబోధిని ... ... శ్రీవత్సలాంచన భట్టాచార్య ద్వారా.
  9. ఆదర్శము ... ... ... మహేశ్వర భట్టాచార్యుడు.
  10. కావ్యప్రకాశటీకా .....కమలాకరమట్టుడు.
  11. నరసింహ మనీషా ... ... నరసింహ ఠాకూర్.
  12. సుధాసాగర ... ... భీమసేనుడు.
  13. బాలబోధిని ... ... భట్ట , వామనాచార్యుడు.

ఇవి, ఇతర గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా కావ్యప్రకాశముపై యాభై వ్యాఖ్యానాలు ఉన్నాయి అని శ్రీఘర్-చండీదాస్ - భాస్కర్ అనే పండితులు తెలుపుచున్నారు. ఇందులో సంకేతమును రచించిన జైన మాణిక్య చంద్రాచార్యులు 1216 సంవత్సరంలో రచించినట్లు తెలుస్తున్నది. అలానే బాలచిత్తానురంజని రచించిన సరస్వతీ తీర్ధులవారు 1298లో జన్మించినట్లు, కాశీ నగరాన్ని త్యజించి సరస్వతీతీర్థంగా పిలువబడే ప్రదేశానికి వెళ్ళినట్లు తెలుస్తున్నది.దీపకా యొక్క నిర్మాణ తేదీని జయంత్ భట్ట స్వయంగా 1350 సంవత్సరంలో రచించాడు. అలానే ఆదర్శ సంకేతమును రాసిన సోమేశ్వర్ భట్ట గురుంచి బాలబోధినిలో వామనాచార్యుడు ప్రస్తావించాడు.

మూలము మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మమ్మటుడు&oldid=4075150" నుండి వెలికితీశారు