పురాణకథనాల ఆధారంగా మహాపద్మ నందుడు (మహాపద్మనంద; క్రీ.పూ. 4 వ శతాబ్దం) పురాతన భారతదేశంలోని నంద సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి. పురాణాలు ఆయనను చివరి శిశునాగ రాజు మహానందుడు, శూద్ర మహిళ కుమారుడు అని వర్ణించాయి. విస్తృతమైన విజయాలు ఆయనకు ఘనత ఇచ్చాయి. వేర్వేరు పురాణాలు ఆయన పాలనకాలాన్ని 28 నుండి 88 సంవత్సరాలుగా పేర్కొన్నాయి. ఆయన తరువాత ఆయన ఎనిమిది మంది కుమారులు వరుసగా పాలించారని పేర్కొంది.

మహాపద్ముడు
Coin of Mahapadma Nanda
A silver coin of 1 karshapana of King Mahapadma Nanda or his sons (345-321 BCE)
First Emperor of Nanda Empire
Reignc. 4th century BCE
PredecessorMahanandin
రాజవంశంNanda
తండ్రిMahanandin
తల్లిa Shudra queen

బౌద్ధ గ్రంథాలు ఆయన గురించి ప్రస్తావించలేదు. బదులుగా మొదటి నందపాలకుడు రాజుగా మారిన దొంగ ఉగ్రసేనుడు అని పేరు పేర్కొన్నాయి. ఆయన తరువాత ఆయన ఎనిమిది మంది సోదరులు వచ్చారు. వీరిలో చివరివాడు ధననందుడు.

జీవితం మార్చు

పురాణాల ఆధారంగా మొదటి నందరాజును మహాపద్ముడు లేదా మహాపద్మ-పతి అని పిలుస్తారు ("అపారమైన సంపన్నుడు"). ఆయన చివరి మహానందకు ఒక శూద్ర మహిళకు జన్మించిన కుమారుడు.[1][2]

పురాణాలు ఆయనను ఎకరతు (ఏకైక సార్వభౌమాధికారి) సర్వ-క్షత్రితక (క్షత్రియులను నాశనం చేసేవాడు) గా అభివర్ణిస్తాయి.[2][3] మహాపద్ముడు నిర్మూలించినట్లు చెప్పబడే క్షత్రియులు (యోధులు, పాలకులు) మైథాలాలు, కషేయాలు, ఇక్ష్వాకులు, పంచాలులు, శూరసేనులు, కురులు, హైహయాలు, వితిహోత్రులు, కళింగులు, అష్మకులు ఉన్నారు.[4]

మత్స్య పురాణం మహాపద్మ 88 సంవత్సరాల (నమ్మశక్యం కాని విధంగా) పాలనచేసాడని పేర్కొంటున్నది. అయినప్పటికీ వాయు పురాణం ఆయన 28 సంవత్సరాలు మాత్రమే పాలన సాగించినట్లు పేర్కొంది.[5] మహాపద్ముడి ఎనిమిది మంది కుమారులు ఆయన తరువాత మొత్తం 12 సంవత్సరాలు పరిపాలించారని పురాణకథనాలు చెబుతున్నాయి. అయితే ఈ కుమారులలో ఒకరికి మాత్రమే పేరు పేర్కొనబడింది: సుకల్పా.[6]

ఇండోలాజిస్టు ఎఫ్. ఇ. పార్గిటరు నంద పట్టాభిషేకం క్రీ.పూ 382 నాటిది. చరిత్రకారుడు అభిప్రాయం ఆధారంగా ఆర్. కె. ముఖర్జీ దీనిని క్రీ.పూ. 364 నాటిది.[7]: పిఎన్ చరిత్రకారుడు హెచ్. సి. రాయచౌదరి ఈ సంఘటనను సి. క్రీ.పూ.345.[8]

మొదటి నందరాజు గురించిన ఇతర కథనాలు మార్చు

  • బౌద్ధ గ్రంథాల ఆధారంగా మొదటి నందరాజు ఉగ్రసేనుడు (మహాపద్మ) కాదు.[9]
    • మహాపద్మకు పురాణకథనాలు మిశ్రమ శూద్ర పూర్వీకత కేటాయించినట్లు కాకుండా, బౌద్ధ గ్రంథాలు ఉగ్రసేనుడిని "అవ్యక్త వంశం"గా వర్ణించాయి. మహావంశ-భాష్యం ఆధారంగా ఉగ్రసేనుడు సరిహద్దు ప్రాంతానికి చెందినవాడు: ఆయనను దొంగల ముఠా బంధించిన తరువాత ఆయనవారి నాయకుడయ్యాడు.[2]
    • గ్రీకో-రోమను వనరులు అలెగ్జాండరు దండయాత్ర సమయంలో నందరాజు పాలనను "అగ్రాం" అని పేర్కొన్నాయి. ఇది సంస్కృత పదం "అగ్రసేనియా" (అక్షరాలా "ఉగ్రసేన కుమారుడు లేదా వారసుడు") వికృతి పదరూపం కావచ్చు.[9]
    • పురాణకథనాల మాదిరిగా కాకుండా బౌద్ధ గ్రంథాలు తరువాతి ఎనిమిది మంది రాజులను మొదటి నందరాజుకు సోదరులు (కుమారులు కాదు) అని వర్ణించాయి.[2]అలాగే బౌద్ధ సంప్రదాయం ఆధారంగా నందాలు మొత్తం 22 సంవత్సరాలు పాలించారు. ఈ రాజులలో చివరివాడు ధననందుడు.[10]
  • జైన గ్రంథాల ఆధారంగా "మహాపద్మ" అనే పేరును ప్రస్తావించని పారిషిష్టపర్వను " అవశ్యక సూత్రం " నందరాజు ఒక నాయిబ్రాహ్మణుడికి వేశ్య కుమారుడు.[1][11][12]
  • నందా రాజవంశం స్థాపకుడు నాయిబ్రాహ్మణ అని గ్రీకో-రోమను వర్గాలు సూచిస్తున్నాయి. ఆయన మునుపటి రాజవంశం చివరి రాజు నుండి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[9] రోమను చరిత్రకారుడు కర్టియసు (సా.శ. 1 వ శతాబ్దం) పోరసు అభిప్రాయం ఆధారంగా ఈ నాయిబ్రాహ్మణ తన ఆకర్షణీయమైన రూపంతో మాజీ రాణి వివాహేతర సంబంధం ఏర్పరచుకుని అప్పటి రాజును ద్రోహంతో హత్య చేసి అప్పటి రాకుమారులకు సంరక్షకుడిగా నటించడం ద్వారా అత్యున్నత అధికారాన్ని స్వాధీనం చేసుకుని తరువాత రాకుమారులను చంపారు.[13] పోరసు (పురుషోత్తముడు), అలెగ్జాండరు సమకాలీనుడైన నందరాజు ఈ నాయిబ్రాహ్మణ కుమారుడు.[9]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 H. C. Raychaudhuri 1988, p. 13.
  2. 2.0 2.1 2.2 2.3 Upinder Singh 2016, p. 273.
  3. R. K. Mookerji 1988, p. 8.
  4. H. C. Raychaudhuri 1988, p. 17.
  5. Dilip Kumar Ganguly 1984, p. 23.
  6. Dilip Kumar Ganguly 1984, p. 20.
  7. K. D. Sethna 2000.
  8. Harihar Panda 2007, p. 28.
  9. 9.0 9.1 9.2 9.3 H. C. Raychaudhuri 1988, p. 14.
  10. Irfan Habib & Vivekanand Jha 2004, p. 13.
  11. R. K. Mookerji 1988, p. 14.
  12. Upinder Singh 2016, p. 272.
  13. R. K. Mookerji 1966, p. 5.

జీవితచరిత్ర మార్చు