మారెళ్ల కేశవరావు

మారెళ్ల కేశవరావు (జూలై 3, 1924 - జూన్ 23, 1993) వాయులీన విద్వాంసులు.[1] ఆకాశవాణిలో అతని వాయులీన సంగీత కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.[2] అతను ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వాయులీన విధ్వాంసులలో ఒకడు.[3]

మారెళ్ల కేశవరావు

జీవిత విశేషాలు మార్చు

అతను ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో జన్మించాడు. పుట్టుకతోనే అంధులైన అతను విజయనగరం చేరారు. అక్కడ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పనిచేస్తున్న ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద శిష్యరికం చేసి వాయులీనంలో ప్రావీణ్యత సంపాదించాడు.[4] అతను మద్రాసు మ్యూజిక్ అకాడమీ నిర్వహించే వార్షిక కచేరీలలో పాల్గొన్నాడు. అతని కచేరీ కార్యక్రమాలు 1946 డిసెంబరు 31, 1949 జనవరి 1న జరిగాయి.[5] అతను 1961 నవంబరు 5 న మద్రాసులో జరిగిన రేడియో సంగీత సమ్మేళన్ కార్యక్రమంలో కర్ణాటక సంగీత విభాగంలో పాల్గొన్నాడు.[6]

మూలాలు మార్చు

  1. "మహా నగరం.. సంగీత సాగరం - Namasthetelangaana". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-27. Retrieved 2020-06-24.
  2. Delhi, Publications Division (India),New (1959-12-27). AKASHVANI: Vol. XXIV. No. 52. ( 27 DECEMBER, 1959 ) (in ఇంగ్లీష్). Publications Division (India),New Delhi.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  3. "ప్రసార ప్రముఖులు/హైదరాబాదు కేంద్రం - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-26. Retrieved 2020-06-24.
  4. "హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-11-15. Retrieved 2020-06-24.
  5. "ANNUAL CONFERENCE AND CONCERTS 1940 – 1950 – Music Academy". musicacademymadras.in. Archived from the original on 2020-06-24. Retrieved 2020-06-24.
  6. Radio sangeetha sammelan, 1961, All India Radio, Madrs

బాహ్య లంకెలు మార్చు