రాజీవ్ యువశక్తి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు రాజీవ్ యువశక్తి పథకం ద్వారా భరోసానిస్తుంది.

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే పథకం. వివిధ కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించే (స్కిల్‌ డెవలెప్‌మెంట్‌) కార్యక్రమం ఇందులో భాగం. వ్యక్తిగత రుణాలు , చిరు వ్యాపారాలు, గ్రూపు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలున్నాయి.20%సబ్సిడీగా చెల్లిస్తారు.70% బ్యాంకు రుణం 10% లబ్ధిదారుని వాటా. గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.యూనిట్ల మంజూరుకు బ్యాంకులు కూడా అంగీకరించాలి.వివిధ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇస్తారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కాల్‌సెంటర్‌ ట్రైనింగ్‌, డీటీపీ, సెక్యూరిటీ గార్డు, కారు డ్రైవింగ్‌, కంప్యూటర్‌ ట్రైనింగ్‌ తదితర కోర్సులు ఉన్నాయి.

రాజీవ్ యువశక్తి పథకంలో బాగంగా జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లాయువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రుణాలు అందించారు. 2010-2011 సంవత్సరంలో 281 యూనిట్లకు గానూ అన్నింటినీ మంజూరు చేశారు. 2011-12 సంవత్సరానికి గానూ 189 యూనిట్లకు గానూ 189 మంజూరు చేశారు. 2012-13 సంవత్సరానికి 350 యూనిట్లకు 439 యూనిట్లు అందించనున్నారు. 2014-15 సంవత్సరంలో 365 యూనిట్ల లక్ష్యం ఉంది. అయితే ఇప్పటికే 110 యూనిట్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయి.[1]

మూలాలు మార్చు

  1. "యువతకు భరోసా". Sakshi. 2014-11-15. Retrieved 2020-08-28.