రాబర్ట్ ఎడ్విన్ పియరీ (జననం: మే 6, 1856 - మరణం: ఫిబ్రవరి 20, 1920) ఏప్రిల్ 6, 1909 నాడు, భౌగోళిక ఉత్తర ధృవం చేరుకున్న మొదటి అన్వేషక యాత్రికుడని చెప్పుకుంటున్న ఒక అమెరికన్ అన్వేషకుడు. పియరీ మే 6, 1856 న క్రిస్సన్, పెన్సిల్వేనియాలో జన్మించాడు.[1] ఇతను పోర్ట్లాండ్, మైనేలో పెరిగారు. పియరీ బౌడోయిన్ కళాశాలలో విద్యను అభ్యసించాడు. ఇతను 1888 లో జోసెఫిన్ డైబిట్స్‌చ్ ను పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరికి కలిపి ఇద్దరు పిల్లలు. అలేక్వసినాకు, ఈయనకు కలిపి మరొక పిల్లవాడితో కలిపి మొత్తం ఈయనకు ముగ్గురు పిల్లలు. పియరీ 63 సంవత్సరాల వయస్సులో అనారోగ్యానికి గురై ఫిబ్రవరి 20, 1920 న వాషింగ్ టన్ డి.సి.లో మరణించాడు.

రేర్ అడ్మిరల్ రాబర్ట్ పియరీ
సుమారుగా 1911 ప్రాంతాల్లో నావికా యూనిఫారంలో పియరీ
జననం
రాబర్ట్ ఎడ్విన్ పియరీ

(1856-05-06)1856 మే 6
క్రిస్సన్, పెన్సిల్వేనియా
మరణం1920 ఫిబ్రవరి 20(1920-02-20) (వయసు 63)
వాషింగ్టన్, డి.సి.
జాతీయతఅమెరికన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
జియోగ్రాఫిక్ ఉత్తర ధ్రువం
జీవిత భాగస్వామిజోసెఫిన్ డైబిట్స్‌చ్ పియరీ
అలేక్వసినా
పిల్లలుమేరీ అహ్నిగిటో పియరీ
రాబర్ట్ ఎడ్విన్ పియరీ, జూనియర్
కలి పియరీ (అలేక్వసినా చే)
పురస్కారాలుకుల్లుం జియోగ్రాఫికల్ మెడల్ (1896)
చార్లెస్ పి. డాలీ మెడల్ (1902)
హుబ్బార్డ్ మెడల్ (1906)

మూలాలు మార్చు

  1. "Rear Admiral Robert E. Peary, US Navy 1856–1920". Biographies in Naval History. Naval History & Heritage Command, US Navy. Archived from the original on 2013-01-02. Retrieved December 29, 2012.