రామలింగేశ్వరస్వామి దేవాలయం (చిలుమూరు)


రామలింగేశ్వరస్వామి దేవాలయం బాపట్ల జిల్లా చిలుమూరు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

రామలింగేశ్వరస్వామి దేవాలయం
రామలింగేశ్వరస్వామి దేవాలయం is located in Andhra Pradesh
రామలింగేశ్వరస్వామి దేవాలయం
రామలింగేశ్వరస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:బాపట్ల
ప్రదేశం:చిలుమూరు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:రామలింగేశ్వరస్వామి దేవాలయం

స్థలపురాణం మార్చు

ఈ దేవాలయంలో శ్రీగంగా,పార్వతీ సమేతంగా రామలింగేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. అత్యంత పురాతనమైన శివలింగాల్లో ఇదొకటి. త్రేతాయుగంలో సీతాదేవి ప్రతిష్ఠించిన ఇసుకలింగం ఇది. కృష్ణానదీ తీరంలో కొలువున్న ఈస్వామి వారికి ఇతిహాసిక ప్రాధాన్యత చాలా ఉంది.త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ వధ అనంతరం సీతాదేవిని తీసుకుని తిరిగివస్తూ పాపనివారణకై శివలింగ ప్రతిష్ఠలు చెయ్యాలనినిశ్చయించుకున్నాడు.చిలుమూరు ప్రాంతంలో, కృష్ణానదీ తీరంలో శివలింగాన్ని సీతాదేవి ప్రతిష్ఠించడానికి నిశ్చయించుకుని ఆంజనేయుడ్ని కాశీవెళ్ళి ఓ శివలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించింది.ఆయితే వెళ్ళిన మారుతి ఎంత సమయం గడిచినా రాకపోవడం, ముహూర్తం సమీపించడంతో సీతాదేవి నదీతీరంలోని ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి, ఆ లింగాన్ని ప్రతిష్ఠించింది.అనంతరం అక్కడికి శివలింగముతో వచ్చిన ఆంజనేయుడు సీతాదేవి అప్పటికే లింగాన్ని ప్రతిష్ఠించడం చూసి కుపితుడయ్యాడు. కోపంతో పీతాదేవి ప్రతిష్ఠించినరామలింగేశ్వర స్వామి లింగాన్ని తన వాలముతో చుట్టి పెకలించబోవగా, ఎంత ప్రయత్నించినా ఆ లింగం కదలలేదు. దానికిగుర్తుగా ఈ నాటికీ కుచ్చుతో కూడిన తోక గుర్తు లింగము పై కనిపిస్తుంది. ఆ కోపంలోనే ఆంజనేయుడు తాను తీసుకు వచ్చిన లింగాన్ని కృష్ణా నది అవతల వైపుకి విసిరేశాడు. ఆ లింగమే కృష్ణా జిల్లా ఐలూరులో వున్న రామలింగేశ్వర స్వామి ఈ క్షేత్రాన్ని ఉభయరామేశ్వరములలో ఒకటిగా పరిగణిస్తారు. సీతాదేవి ప్రతిష్ఠించినప్పుడు ఈ లింగము చిన్నదైనా ప్రతిష్ఠ అనంతరం పెరుగుతూ ఉండటం వల్ల సీతా దేవి నదిలో ఉన్న ఇనుకని తీసుకుని లింగాగ్రము మీద ఉంచినందు వల్ల గుప్పిటంత బొడిపికలిగి లింగము కనిపిస్తూ వుంటుంది. దానితో లింగము పెరుగుదల నిలిచిపోయింది.[1]

ఆలయ విశేషాలు మార్చు

దేవాలయం లోపల నాలుగు దిక్కుల్లోనూ మారేడు చెట్లు ఉన్నాయి.చాలా పెద్ద శమీ,వృక్షమును కూడా ఈ దేవాలయంలో చూడవచ్చు. స్వామి పశ్చిమ దిశగా ఉంటాడు.

ఉత్సవాలు మార్చు

మహా శివరాత్రి పర్వ దినం నాడు ఇక్కడ జరిగే ఉత్సవం అతి వైభవంగా చేస్తారు.

రవాణా సౌకర్యం మార్చు

తెనాలి నుంచి బస్సు సౌకర్యం కలదు .

మూలాలు మార్చు

  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004.