రెండవ రాజాధిరాజ చోళుడు

రెండవ రాజాధిరాజ చోళుడు (సా.శ. 1166–1178) రెండవ రాజరాజ చోళుడి తరువాత చోళ రాజుగా పరిపాలించాడు. రెండవ రాజరాజ చోళుడు సా.శ. 1166 లో విక్రమచోళుడి మనవడు రెండవ రాజాధిరాజ చోళుడిని తన వారసుడిగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయనకు సింహాసనాన్ని అధిరోహించే వయస్సు ఉన్న తన స్వంత కుమారులు లేరు.[2]

రెండవ రాజాధిరాజ చోళుడు
Rajakesari
Chola territories during c. 1170 CE
Reignసుమారు 1163 –  1178 CE
PredecessorRajaraja Chola II
SuccessorKulothunga Chola III
మరణం1178 CE
తండ్రిNēriyudaiperumal[1]

రెండవ రాజధిరాజ చోళుడిని స్థాపించిన వెంటనే పాండ్య దేశంలో తలెత్తిన తీవ్రమైన వివాదం చోళ, సింహళ పాలకుల జోక్యానికి దారితీసింది. ఇది ఇద్దరికీ కష్టాలను తెచ్చిపెట్టింది. ఈ అంతర్యుద్ధం బూడిద నుండి పాండ్యశక్తి పుట్టుకొచ్చి దానిని పునరుద్ధరించిన బలంతో త్వరలోనే చోళ, సింహళ రాజ్యాలను మింగేసింది.

సిoహాసనo అధిరోహించుట మార్చు

పల్లవరాయణ్పేట్టై శాసనం ఆధారంగా రెండవ రాజరాజ చోళుడి పాలన ముగిసే సమయానికి, ప్రధానమంత్రి కులాతుల్లాను తిరుసిట్రంబలముడైయాను పెరుమన్నంబి (పల్లవరాయరు) సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హతగల కుమారులు లేరని రాజు దృష్టికి తీసుకువచ్చారు. దీని ఆధారంగా ఇతర యువరాజుల గురించి ఆరా తీసిన తరువాత ఆయన గంగైకొండచోళపురంలోని రాజభవనం నుండి నెరియుడైపెరుమాళు కుమారుడు, విక్రమా చోళ మనవడూ అయిన ఎడిరిలాపెరుమాళును వారసుడుగా తీసుకువచ్చాడు. రెండవ రాజరాజ చోళుడు అప్పుడు ఈ యువరాజుగా ప్రకటించి వారసుడిగా చేసాడు. ఈ సంఘటన జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత రెండవ రాజరాజ చోళుడు మరణించినప్పుడు ప్రధానమంత్రి పల్లవరాయరు ఎడిరిలిపెరుమాళు (ఎదిరిల్లా చోళను) ను రాజాధిరాజ చోళుడు అనే బిరుదుతో రాజుగా అభిషేకం చేశారు. రెండవ రాజరాజ చోళుడి ఇద్దరు కుమారులు ఒకటి, రెండు సంవత్సరాల వయస్సు గల వారిని మరొక ప్రదేశానికి సురక్షితంగా తీసుకెళ్లారు. ఎందుకంటే వారు రాజభవనంలో నివసించడం ఇక మీదట సురక్షితం కాదని ఆయన విశ్వసించాడు.[2] కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఆధారంగా రాజాధిరాజ చోళుడు తండ్రి నెరియుడైపెరుమళు రెండవ కులోత్తుంగ చోళుడు సోదరుడు, విక్రమచోళ మరొక కుమారుడు.[3]

పాండ్యుల అంతర్యుద్ధం మార్చు

మొదటి కులోత్తుంగ చోళుడు పాండ్య దేశాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత స్థానిక పాండ్య యువరాజులు చోళుల అస్పష్టమైన ఆధిపత్యానికి లోబడి తమకు నచ్చిన విధంగా పాలించటానికి అనుమతించబడ్డారు. కొంతమంది పాండ్యులు చోళులకు విధేయులుగా ఉన్నారు. ఒక పరాంతక పాండ్యుల మొదటి కులోత్తుంగ చోళుడు కళింగ పోరాటంలో పాల్గొన్నాడు. మొదటి కులోత్తుంగ తరువాత చోళులు పాండ్యుల మీద తమకున్న ఉన్న కొద్దిపాటి నియంత్రణను కోల్పోయారు. మొదటి కులోతుంగ చోళుడి పాలన తరువాత పాండ్య దేశంలో శాసనాలు ఏవీ లేవు.

మదురైలో సుమారు సా.శ. 1166 పరక్రామ పాండ్య, కులశేఖర వారసత్వం గురించి గొడవ పడ్డారు. కులశేఖకుడు మదురై మీద దాడి చేశాడు. పరాక్రమ లంకరాజు మొదటి పరాక్రమబాహుకి విజ్ఞప్తి చేశారు. సింహళ సహాయం పరాక్రమానికి చేరుకోకముందే కులశేఖకుడు మదురైని తీసుకొని పరకరమ, ఆయన భార్య, ఆయన కొంతమంది పిల్లలను చంపాడు. కులశేఖరుని ఓడించి, పాండ్య సింహాసనాన్ని పరాక్రమ పాండ్య కుమారుడికి ప్రసాదించే వరకు సింహళ రాజు తన సైన్యాధికారిని యుద్ధం కొనసాగించమని ఆదేశించాడు.

కులశేఖరుడు మంచి పోరాటం చేశాడు. సింహళ దళాలు లంక నుండి బలగాలు పొందవలసి వచ్చింది. కులశేఖరుడు అప్పుడు రెండవ రాజధీరాజ చోళుడికి విజ్ఞప్తి చేశాడు. ఆయన సహాయానికి పెద్ద శక్తిని పంపారు. అయితే కులశేఖరుడు లంక దళాల మీద పోరాటంలో ఓటమిని ఎదుర్కొన్నాడు. లంక సైన్యాధ్యక్షుడు పరాక్రమ పాండ్య కుమారుడు వీరపాండ్యను సింహాసనం మీద నియమించారు. చోళ దళాలు, సింహళ దళాల మధ్య పోరాటం కొనసాగింది. చోళసైన్యం త్వరలోనే సింహళ దళాలను ఓడించి వారిని తిరిగి ద్వీపానికి తరలించింది. అన్నను పల్లవరాయణ పోరాటంలో, చోళ సైన్యాధ్యక్షుడు ఇద్దరు సింహళ సైన్యాధ్యక్షులైన లంకాపురి తండనాయగను, జగత్విసాయ తండనాయగను శిరచ్ఛేదనం చేశారు. చోళులు కుళశేఖరుడిని పాండ్య రాజుగా చేసిన తరువాత ఇద్దరు సైనికాధికారుల తలల పాండ్య కోటలో ఏర్పాటు చేశారు.

పరాక్రమబాహు చోళ ప్రధాన భూభాగానికి వ్యతిరేకంగా ఎదురుదాడిని సిద్ధం చేశాడు. ఇది విన్న చోళ సైన్యాధ్యక్షుడు లంక ద్వీపం మీద దండయాత్ర చేపట్టడానికి సింహళ పాలకుడు పరాక్రమబాహు ప్రత్యర్థి శ్రీవల్లభను ప్రేరేపించాడు. ఒక నావికాదళ యాత్ర లంకలో దిగి అనేక ప్రదేశాల మీద దాడి చేసి నాశనం చేసింది. పరాక్రమ పాండ్యకు తనిచ్చిన మద్దతు తనకు తెచ్చిన నష్టాన్ని చూసిన పరాక్రమబాహు కులశేఖరను పాండ్యరాజ్యానికి నిజమైన రాజుగా గుర్తించి, చోళులకు వ్యతిరేకంగా అతనితో పొత్తు పెట్టుకున్నాడు. చోళులు కులశేఖర ద్రోహాన్ని కనుగొని వారి విధానాన్ని ఒకేసారి మార్చారు. మరింత పోరాటం తరువాత చోళులు పాండ్య సింహాసనం మీద విరాపాండ్యను ఏర్పాటు చేసి కులశేఖరుడిని బహిష్కరించారు.

సామ్రాజ్యం బలహీనపడుట మార్చు

రెండవ రాజరాజ చోళుడు కాలంలో ప్రారంభమైన స్థానిక పాలెగాళ్ళు, అధిపతుల స్వాతంత్ర్యం రాజధీరాజ పాలనలో మరింత స్పష్టంగా కనిపించింది. వారు కేంద్ర ప్రభుత్వంలో తమ ప్రభావాలను మరింతగా విస్తరించడం ప్రారంభించారు. ఇది రాజు అధికారాన్ని ఈ తారుమారుచేసి దేశంలోని స్థానిక ప్రభుత్వ ప్రాంతాల మీద తన నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర పరిపాలనను బలహీనపరిచింది.

ఈ పాలెగాళ్ళ పెరుగుదల రెండు పరిణామాలను కలిగి ఉంది. మొదటిది, రాజును ప్రభుత్వ ప్రతిష్ఠను దాని ప్రభావ రంగాన్ని ఎక్కువగా పరిమితం చేయడం ద్వారా బలహీనపరచడం. తద్వారా మిగిలిన పరిపాలన మీద పట్టుబలపరచుకోవడం. రెండవది వారు చోళ ప్రభువులలో ఉన్న అధికారిక పదవులను వంశపారంపర్య హక్కుగా మార్చడానికి ఒకరితో ఒకరు పొత్తులు, ఒప్పందాలను ఏర్పరచుకోవడం ప్రారంభించారు.

మరణం, వారసత్వం మార్చు

రెండవ రాజాధిరాజ చోళుడి వారసుడైన మూడవ కులోత్తుంగ చోళుడు తన పాలనను సా.శ. 1178 నుండి తన శాసనాల్లో పేర్కొన్నాడు. "రెండవ రాజధీరాజ చోళుడు సా.శ. 1182 వరకు జీవించాడు". రెండవ రాజధీరాజ చోళుడు మూడవ కులోత్తుంగ చోళుడుకి సంరక్షకుడు ఆయన చాలా చిన్నతనంలోనే ఆయనను తన సహ రాజప్రతినిధిగా చేశాడు. సా.శ. 1178 లో రాజధిరాజ చోళుడు జీవించి ఉన్నప్పుడే మూడవ కులోత్తుంగ చోళుడు వారసుడుగా నిర్ణయించబడ్డాడు. రెండవ రాజధిరాజ చోళుడు సా.శ. 1182 వరకు జీవించాడని ఇది సూచిస్తుంది. రాజధీరాజ చోళ ఈ ప్రదేశం చుట్టూ పూల తోటలను పెంచినట్లు తెలిసింది.

అంతకు ముందువారు
రెండవ రాజరాజ చోళుడు
చోళ
సా.శ. 1166–1178 CE
తరువాత వారు
మూడవ కులోత్తుంగ చోళుడు

మూలాలు మార్చు

  1. University of Allahabad. Dept. of Modern Indian History; University of Kerala. Dept. of History; University of Kerala, University of Travancore. Journal of Indian History, Volumes 15-16. University of Kerala., 1937. pp. 141–142.
  2. 2.0 2.1 Niharranjan Ray; Brajadulal Chattopadhyaya. A Sourcebook of Indian Civilization. Orient Blackswan, 2000 - History - 673 pages. p. 470.
  3. S. R. Balasubrahmanyam; B. Natarajan; Balasubrahmanyan Ramachandran. Later Chola Temples: Kulottunga I to Rajendra III (A.D. 1070-1280), Parts 1070-1280. Mudgala Trust, 1979 - Architecture - 470 pages. p. 270.
  • The Cholas: mathematics reconstructs the chronology By N. Sethuraman
  • Nilakanta Sastri, K. A. (1935). The CōĻas, University of Madras, Madras (Reprinted 1984).
  • Nilakanta Sastri, K. A. (1955). A History of South India, OUP, New Delhi (Reprinted 2002).