సియాకా (పరిపాలన c.క్రీ.పూ. 949-972), దీనిని హర్ష అని కూడా పిలుస్తారు. పశ్చిమ-మధ్య భారతదేశంలో పాలించిన పరమారా రాజు. ఆయన పరమారా రాజవంశం మొదటి స్వతంత్ర పాలకుడు.

రెండవ సియాక
Maharajadhirajapati
King of Malwa
Reignc. 949-972 CE
PredecessorVairisimha
SuccessorVakpati II (Munja)
రాజవంశంParamara

తన స్వంత శాసనాల నుండి తెలిసిన మొట్టమొదటి పరమారా పాలకుడు సియాకా. ఇవి ప్రస్తుత గుజరాతులో కనుగొనబడ్డాయి. ఆయన ఒకప్పుడు మన్యాఖేట రాష్ట్రకూటుల పాలుగాళ్ళుగా ఉన్నట్లు సూచించబడింది. రాష్ట్రకూట చక్రవర్తి మూడవ కృష్ణ మరణం తరువాత సియాకా కొత్త రాజు ఖోటిగాకు వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రకూట రాజధాని మన్యాఖేటను సా.శ. 972 లో స్వాధీనం చేసుకున్నాడు. ఇది చివరికి రాష్ట్రకూటుల క్షీణతకు దారితీసి పరామారలను ఒక సామ్రాజ్య శక్తిగా స్థాపించింది.

నేపథ్యం మార్చు

 
Harsola Grant A, 949 CE
 
Harsola Grant B, 949 CE

సియాకా రెండవ వైరిసింహ కుమారుడు.[1]సియాకా జారీ చేసిన హర్సోలా రాగి ఫలక శాసనాలు 31 జనవరి 949 నాటివి. దీని ఆధారంగా. జనవరి సా.శ. 949 కి ముందు సియాకా పరమారా సింహాసనాన్ని అధిరోహించి ఉండాలని ఊహించవచ్చు.[2]

పేర్లు, బిరుదులు మార్చు

తన సొంత శాసనాలలో అలాగే ఆయన వారసులైన ముంజా, భోజా శాసనాలు ఆయనను "సియాకా" అని పేర్కొన్నాయి. ఉదయపూరు ప్రశాస్తి శాసనం (సియాకా అని పిలువబడే పూర్వపు రాజు గురించి ప్రస్తావించింది). అలాగే అర్తున శాసనంలో ముంజా పూర్వీకుడిని హర్ష (లేదా శ్రీ హర్ష-దేవా) అని పిలుస్తారు. అందువలన ఆధునిక చరిత్రకారులు ఉదయపూరు శాసనంలో పేర్కొన్న సియాకా నుండి వేరు చేయడానికి ఆయనను రెండవ సియాకా అని కూడా పేర్కొంటారు. కొంతమంది పరిశోధకులు మొదట్ సియాకా కల్పిత వ్యక్తి అని విశ్వసిస్తారు.[2]

మేరుతుంగా తన ప్రబంధ-చింతామణిలో రాజును సింహా-దంత-భాటా (ప్రత్యామ్నాయంగా సింహా-భాటా) అని పేరు పెట్టారు. ఒక సిద్ధాంతం ఆధారంగా "సియాకా" అనేది సంస్కృత "సింహాకా" పదానికి వికృత పదరూపం. జార్జి బుహ్లెరు రాజు పూర్తి పేరు హర్ష-సింహా అని సూచించాడు. ఈ పేరు రెండు భాగాలు ఆయనను సూచించడానికి ఉపయోగించబడ్డాయి.[2]

సైనికవృత్తి మార్చు

సియకా పరమారా సింహాసనం అధిరోహించే సమయానికి ఒకప్పుడు శక్తివంతమైన గుర్జారా-ప్రతిహారాలు అధికారంలో క్షీణించారు. ఎందుకంటే వారిమీద రాష్ట్రకూటలు, చందేలాల నుండి దాడులు జరిగాయి. సియాకా సా.శ. 949 హర్సోలా శాసనాలు ఆయన రాష్ట్రకూట పాలకుడు మూడవకృష్ణ పాలెగాడు సూచిస్తున్నాయి. ఏదేమైనా అదే శాసనం సియకా శీర్షికలలో ఒకటిగా అధికంగా ధ్వనించే మహారాజాధిరాజపతిని కూడా పేర్కొంది. దీని ఆధారంగా, రాష్ట్రకూట ప్రభువును సియాకాగా అంగీకరించడం నామమాత్రమని కె. ఎన్. సేథ్ అభిప్రాయపడ్డారు. సియాకా మొదట ప్రతిహారా సామంతుడు అని సేథు సిద్ధాంతీకరించాడు. కాని ప్రతిహారాలు శక్తి క్షీణించడంతో తన విధేయతను రాష్ట్రకూటులకు మార్చాడు.[3]

యోగరాజా మార్చు

సియాకా శాసనాలు పురాతన పారామర శాసనాలు: అవి ప్రస్తుత గుజరాతులో కనుగొనబడ్డాయి. అందువలన పరమారాలు వారి ప్రారంభ సంవత్సరాలలో గుజరాతులో అనుసంధానించబడినట్లు తెలుస్తుంది.[4] ఒక యోగరాజుకు వ్యతిరేకంగా విజయవంతమైన పోరాటం తరువాత హర్సోలా శాసనాలు ఇద్దరు నగరు బ్రాహ్మణులకు సియాకా గ్రామ నిధులను మంజూరు చేసినట్లు నమోదు చేశాయి. యోగరాజు గుర్తింపు అనిశ్చితం: ఆయన చావ్దా సైనికాధికారి, లేదా చాళుక్య సైనికాఫ్హికారి అవంతివర్మను రెండవ యోగరాజా అయి ఉండవచ్చు. ఈ పాలకులు ఇద్దరూ ప్రతిహరాలకు చెందినవారు. సియాకా రాష్ట్రకూట సామంతులుగా వారిద్దరి మీద దండయాత్రకు దారితీసి ఉండవచ్చు. ఖేతక-మండలా (ఖేడా) పాలకుడి అభ్యర్థన మేరకు సియాకా ఈ నిధులను జారీ చేశాడు. ఆయన రాష్ట్రకూట పాలెగాడుగా కూడా ఉండవచ్చు.[5]

హ్యూణులు మార్చు

పరామర సభ కవి పద్మగుప్తుడు రాసిన పురాణ కవిత నవ-సహసంక-చరిత, సియాకా హ్యూన రాకుమారులను ఓడించి, వారి అంతః పురాన్ని వితంతువుల నివాసంగా మార్చిందని పేర్కొంది.[6] విచ్ఛిన్నమైన మోడీ శాసనం సియాకా ఈ విజయాన్ని కూడా ధ్రువీకరిస్తుంది. ఆయన "హుణుల రక్తం ద్వారా చిలకరించబడిన" భూమిని పరిపాలించాడని పేర్కొన్నాడు. [7] ఈ హ్యూణుల భూభాగం బహుశా మళ్వా వాయవ్య భాగంలో ఉంది. 9 వ శతాబ్దంలో చాళుక్య భూస్వామ్య బాలవర్మను చేత చంపబడిన హ్యూణుల సైనికాధికారి జజ్జాపా వారసుడిని సియాకా ఓడించి ఉండవచ్చు. [6]

చందేలాలు మార్చు

సియాకా రుడపతి ప్రభువును ఓడించాడని నవ-సహసంకా-చరిత కూడా పేర్కొంది. ఈ భూభాగం విదిశ వద్ద దొరికిన ఒక శిలాశాసనంలో పేర్కొన్న "రోడపాడి" వలె కనిపిస్తుంది; రుమపతి పరామరా రాజ్యం తూర్పు సరిహద్దులో ఉన్నట్లు కనిపిస్తుంది. రుదాపతిని జయించడం వలన సియకా చందేలారాజు యశోవర్మనుతో విభేదాలు వచ్చేవి. ఖజురాహోలోని సా.శ. 956 చందేలా శాసనం ఆధారంగా యశోవర్మను మాళవులకు మరణ దేవుడు (అంటే పరమరాల, మాల్వా ప్రాంత పాలకులు). యశోవర్మను చందేలా రాజ్యాన్ని పశ్చిమాన భాస్వతు (విదిషా), మాళ్వా నది (బహుశా బెట్వా) వరకు విస్తరించాడు. ఈ వాస్తవాల ఆధారంగా సియాకా చందేలాలకు వ్యతిరేకంగా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చిందని భావించబడుతుంది.[8]

మాన్యఖేతను స్వాధీనం చేసుకోవడం మార్చు

సా.శ. 963 లో రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణ ఉత్తర భారతదేశం రెండవ దడయాత్రకు నాయకత్వం వహించాడు. దండ మాళ్వా ప్రాంతంలోని ప్రధాన నగరమైన ఉజ్జయానిని వారి బలగాలు నాశనం చేశాయని ఆయన పశ్చిమ గంగా భూస్వామ్య మరసింహా సా.శ. 965 - 968 శాసనాలు పేర్కొన్నాయి. ఎ.ఎస్. ఆల్టెకరు వంటి చరిత్రకారులు సియాకా రాష్ట్రకూటులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడని, ఫలితంగా అతనిపై సైనిక పోరాటం జరిగిందని సిద్ధాంతీకరించారు. ఏదేమైనా ఈ సమయంలో ఉజ్జయిని గుర్జారా-ప్రతిహారా పాలనలో ఉందని కె. ఎన్. సేథు అభిప్రాయపడ్డారు. మూడవ కృష్ణ పోరాటం వారికి వ్యతిరేకంగా ఉంది: సియాకా మూడవ కృష్ణకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడని లేదా అతని దళాలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ఎదుర్కొన్నట్లు చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. [9]

మూడవ కృష్ణ మరణం తరువాత సి.సా.శ. 967 రాష్ట్రకూట శక్తి క్షీణించడం ప్రారంభించింది. [3] ఆయన వారసుడు ఖోటిగా పెరుగుతున్న పరమరాలశక్తి గురించి జాగ్రత్తపడి సియాకా మీద యుద్ధం చేశాడు. నర్మదా నది ఒడ్డున ఖలీఘట్ట వద్ద ఈ యుద్ధం జరిగింది. సాంప్రదాయ పరమారా భూభాగానికి దగ్గరగా పోరాడినందున ఈ యుద్ధంలో ఖోటిగా దూకుడుగా ఉన్నట్లు తెలుస్తుంది. యుద్ధంలో తన వాగాడా ఫ్యూడెటరీ కంకా (లేదా చాచా) ను కోల్పోయినప్పటికీ సియాకా విజయం సాధించాడు. [10]

యుద్ధం తరువాత సియాకా ఖొటిగా తిరోగమన దళాలను రాష్ట్రకూట రాజధాని మన్యాఖేటా వరకు వెంబడించి ఆ నగరాన్ని విధ్వంసం చేసారరు.[10] ఖోటిగా సంపదను యుద్ధంలో తీసుకున్నప్పుడు సియాకా గరుడుని వలె తీవ్రంగా ఉన్నాడని ఉదయపూరు ప్రశాస్తి పేర్కొంది. ఈ సంఘటన సా.శ. 972-973లో జరిగింది. కవి ధనపాల సూచించినట్లు మాళ్వా ప్రభువు మన్యాఖేటను దోచుకుంటున్నప్పుడు ఆయన పైయాలచి-నామమాలా రాశానని పేర్కొన్నాడు.[11] సియాకా విజయం రాష్ట్రకూటల క్షీణతకు దారితీసింది. పరమరాల మాళ్వాలో సార్వభౌమ శక్తిగా స్థాపించబడింది.[10]

చివరి సంవత్సరాలు మార్చు

సియాకా రాజ్యం ఉత్తరాన బాన్స్వరా నుండి దక్షిణాన నర్మదా నది వరకు పశ్చిమాన ఖేతకా-మండలా (ప్రస్తుత ఖేడా / మాహి నది) నుండి తూర్పున విదిషా ప్రాంతం (బెట్వా నది) వరకు విస్తరించబడింది.[12][13]

పరమరా రాజ్యసభా కవి పద్మగుప్తా అభిప్రాయం ఆధారంగా సియాకా ఒక రాజర్షి ("రాజు-సేజ్") : ఆయన సన్యాసిగా పదవీ విరమణ చేసాడు. తరువాత ఆయన నార బట్టలు ధరించాడు.[14] తిలకా-మంజారి, ధనపాల (సియాకా కుమారుడు ముంజా ఆస్థాన కవి) స్వరపరిచిన రచన సియాకా లక్ష్మి (శ్రీ) దేవత భక్తుడని సూచిస్తుంది.[1]

సియాకా, ఆయన రాణి వదజాకు ఇద్దరు కుమారులు ఉన్నారు: ముంజా-రాజా ( వక్పతి), సింధు-రాజా. సియాకా మన్యాఖేటాను సి.సా.శ. 972లో జయించాడు. ఆయన వారసుడు ముంజా మొట్టమొదటి శాసనం సా.శ. 974 నాటిది. కాబట్టి సియాకా పదవీ విరమణ చేసి లేదా సా.శ.972 - 974 CE మధ్య ఎక్కడో మరణించి ఉండాలి. [15]

శిలాశాసనాలు మార్చు

 
Find spots of the inscriptions from Siyaka's reign[16]

సియాకా క్రింది శాసనాలు కనుగొనబడ్డాయి. ఈ నమోదిత మంజూరులు సంస్కృత భాష, నగరి లిపిలో వ్రాయబడ్డాయి.[16]

949 హర్సోల రాగి ఫలకాలు మార్చు

31 జనవరి 949 న జారీ చేయబడిన ఈ శాసనం 20 వ శతాబ్దంలో హర్సోలుకు చెందిన విస్నగరు బ్రాహ్మణుడి ఆధీనంలో కనుగొనబడింది. సియాకా తన ప్రారంభ సంవత్సరాలలో రాష్ట్రకూట భూస్వామ్యవాది అని ఇది సూచిస్తుంది. ఇది ఆనందపుర (నగర బ్రాహ్మణ తండ్రి-కొడుకు ద్వయం (వాడ్నగరుగా గుర్తించబడింది) కు రెండు గ్రామాల నిధులను మంజూరు చేసినట్లు నమోదు చేస్తుంది. కుంభరోతక, సిహాకా గ్రామాలు ఆధునిక గ్రామాలైన కమ్రోడు, సికాలుగా గుర్తించబడ్డాయి. [17]

969 అహ్మదాబాదు రాగి ఫలకం మార్చు

క్రీస్తుశకం 14 అక్టోబరు 969 న జారీ చేయబడిన ఈ విచ్ఛిన్న శాసనం 20 వ శతాబ్దం ప్రారంభంలో ఖేడా నివాసి వద్ద ఉంది. ఆయన 1920 లో అహ్మదాబాదు గుజరాతు పురాతత్వ మందిరానికి చెందిన ముని జినవిజయకు సమర్పించాడు.[18]

ఈ శాసనం మొదట రెండు రాగి ఫలకాలను కలిగి ఉంది వాటిలో రెండవది మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. శాసనం గ్రాంటును నమోదు చేస్తుంది. అయితే ఈ గ్రాంటు కచ్చితమైన స్వభావాన్ని రెండవ్ ఫలకం 10-లైను నుండి నిర్ణయించలేము. ఈ ప్లేటు గరుడ (పరమారా రాజ చిహ్నం) ను మానవ రూపంలో వర్ణిస్తుంది. దాని ఎడమ చేతిలో ఉన్న పామును కొట్టడం గురించి. గరుడ క్రింద రాజు సంకేత చిహ్నం ఉంది. దపకా పేరు (గ్రాంట్లను నమోదు చేసే అధికారి) కహపాయికా అని పేర్కొనబడింది. సియాకా కుమారుడు ముంజా సా.శ. 974 ధర్మపురి మంజూరులో ఇదే పేరు కనిపిస్తుంది. [18]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 G. P. Yadava 1982, p. 37.
  2. 2.0 2.1 2.2 K. N. Seth 1978, p. 75.
  3. 3.0 3.1 K. N. Seth 1978, pp. 76–77.
  4. H. V. Trivedi 1991, p. 9.
  5. H. V. Trivedi 1991, pp. 4–5.
  6. 6.0 6.1 K. N. Seth 1978, p. 79.
  7. Arvind K. Singh 2012, p. 16.
  8. K. C. Jain 1972, p. 334.
  9. K. N. Seth 1978, pp. 80–81.
  10. 10.0 10.1 10.2 K. N. Seth 1978, pp. 81–84.
  11. Arvind K. Singh 2012, pp. 16–17.
  12. K. C. Jain 1972, p. 335.
  13. Arvind K. Singh 2012, p. 17.
  14. K. N. Seth 1978, pp. 84.
  15. K. N. Seth 1978, pp. 85.
  16. 16.0 16.1 H. V. Trivedi 1991, pp. 3–9.
  17. H. V. Trivedi 1991, pp. 3–5.
  18. 18.0 18.1 H. V. Trivedi 1991, pp. 8–9.

గ్రంధసూచిక మార్చు

  • Arvind K. Singh (2012). "Interpreting the History of the Paramāras". Journal of the Royal Asiatic Society. 22 (1): 13–28. JSTOR 41490371.
  • G. P. Yadava (1982). Dhanapāla and His Times: A Socio-cultural Study Based Upon His Works. Concept.
  • Harihar Vitthal Trivedi (1991). Inscriptions of the Paramāras (Part 2). Corpus Inscriptionum Indicarum Volume VII: Inscriptions of the Paramāras, Chandēllas, Kachchapaghātas, and two minor dynasties. Archaeological Survey of India. doi:10.5281/zenodo.1451755.
  • K. C. Jain (1972). Malwa Through the Ages, from the Earliest Times to 1305 A.D. Motilal Banarsidass. ISBN 978-81-208-0824-9.
  • K. N. Seth (1978). The Growth of the Paramara Power in Malwa. Progress.