వకుళాభరణం రాగము

(వకుళాభరణం రాగం నుండి దారిమార్పు చెందింది)

వకుళాభరణం రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 14వ మేళకర్త రాగము.[1] దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీతం పాఠశాలలో ధాటి వసంత భైరవిi[2][3], లేదా వాటి వసంత భైరవి[4] అని పిలుస్తారు.

Vakulabharanam scale with shadjam at C

లక్షణాలు మార్చు

(S R1 G3 M1 P D1 N2 S)
(S N2 D1 P M1 G3 R1 S)

ఇందులోని స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కైసకి నిషాధం.

ఇదొక సంపూర్ణ మేళకర్త రాగము. ఇది 50వ మేళకర్త రాగమైన నామనారాయణ రాగానికి శుద్ధ మధ్యమ సమానమైనది.

జన్య రాగాలు మార్చు

వకుళాభరణ రాగానికి సంబంధించిన జన్య రాగాలలో వసంతభైరవి ఒకటి.

ఉదాహరణలు మార్చు

ఈ రాగంలోని కొన్ని రచనలు.

  • ఏ రాముని నమ్మితినో -త్యాగరాజు
  • రామ నామమై - మైసూర్ వాసుదేవాచారి
  • గౌరీనాథం - ఓట్టుక్కడు వెంకట కవి
  • నంబినేన్ అయ్యా - కోటేశ్వర్ అయ్యర్
  • కుమారుని వాలెము కావవే - మంగళంపల్లి బాలమురళీకృష్న


మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
  4. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A. Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai, India