శార్దా రాం పిల్లౌరీ

భారతీయ రచయిత

శార్దా రాం పిల్లౌరీ (1837 సెప్టెంబరు 30[1] – 1881 జూన్ 24) హిందూ మత ప్రముఖుడు, సామాజిక సంస్కర్త, జ్యోతిష్యుడు, రచయిత. ఆయన పంజాబీ, హిందీ భాషల్లో రాసిన సాహిత్యం చాలా ప్రసిద్ధి చెందినది. ఆధునిక పంజాబీ గద్య సాహిత్య పితగా పేర్కొంటారు.[2]

జీవిత సంగ్రహంసవరించు

శార్దా రాం 1837లో జలంధర్ లోని ఫిల్లౌరీ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.[2][3] ఆయన తండ్రి జై దయాలు జ్యోతిషుడు.[2] సాధారణ చదువులు ఏమీ చదువుకోలేదు శార్దా.[1] ఏడవ ఏట మాత్రం గురుముఖీ రాయడం నేర్చుకున్నారు.[2] పదవ ఏట హిందీ, సంస్కృతం, పర్షియా భాష, జ్యోతిష్య శాస్త్రం, సంగీతం నేర్చుకున్నారు.[2]   ఆ తరువాత హిందూ మత ప్రబోధకునిగా మారారు.[2][3][4]

ఆయన పుస్తకాల్లో పంజాబీ భాష, సంప్రదాయం గురించీ వివరించారు.[2][3]

1865లో శార్దా రాం మహాభారతం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల బ్రిటిష్ అధికారులు తమ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణలు తెచ్చారు.[2][3] అందువల్ల ఆయన స్వంతూరు పిల్లౌరీ నుండి కొంత కాలం దూరంగా వెళ్ళమని శిక్ష విధించారు.[2][3]

అమృత్ సర్, లాహోర్ ప్రాంతాల్లో జ్యోతిష్యం చెప్తూ తిరిగేవారు  ఆయన.[2] అప్పుడే ఆయన మంచి వాసి గల జ్యోతిష్యునిగా పేరొందారు.  అదే సమయంలో ఆయన హిందీ భాషలో ఎన్నో పుస్తకాలు  రాశారు.[2] 

హిందీలో మొదటి నవల రాసింది శార్దారమేనని ఈ మధ్యనే నిరూపింపబడింది.[2][3][5] ఆయన అమృత్ సర్ లో రాసిన భాగ్యవతి నవలే హిందీలో మొదటగా ప్రచురింపబడింది. 1888లో ఆయన చనిపోయిన తరువాత ప్రచురించారు.[2] ఆ నవలలో మహిళల అభ్యుదయం గురించి రాశారాయన. ఆ సమయానికి అదంతా చాలా అభ్యుదయకరమైన విషయం.[2][3]

శార్దా రాం 1881 జూన్ 24న లాహోర్లో చనిపోయారు.[2] Shardha Ram died on 24 June 1881 at Lahore.[2]

రచనలుసవరించు

పుస్తకం సంవత్సరం
సిఖన్ దే రాజ్ దీ విథై (సిక్కు రాజ్యం గురించిన కథ) [2][3] 1866
పంజాబీ బట్చీత్[2][3]
ఓం జై జగదీశ్ హరే[2][3] 1870s
భాగ్యవతి[2][3] 1888లో ప్రచురింపబడింది
సత్య ధర్మ్ ముక్తావళి[3]
శతోపదేశ్[3]
Satyamrit Pravaha[3]

Notes and referencesసవరించు

  1. 1.0 1.1 Singh Bedi, Harmohinder.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 2.13 2.14 2.15 2.16 2.17 2.18 2.19 Walia, Varinda.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 Maitray, Mohan.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-29. Retrieved 2016-08-05.
  5. Previously, Lala Sri Niwas was credited with this achievement; his Priksha Guru was written in 1902.

జీవిత సంగ్రహంసవరించు

శార్దా రాం 1837లో జలంధర్ లోని ఫిల్లౌరీ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.[1][2] ఆయన తండ్రి జై దయాలు జ్యోతిషుడు.[1] సాధారణ చదువులు ఏమీ చదువుకోలేదు శార్దా.[3] ఏడవ ఏట మాత్రం గురుముఖీ రాయడం నేర్చుకున్నారు.[1] పదవ ఏట హిందీ, సంస్కృతం, పర్షియా భాష, జ్యోతిష్య శాస్త్రం, సంగీతం నేర్చుకున్నారు.[1]   ఆ తరువాత హిందూ మత ప్రబోధకునిగా మారారు.[1][2][4]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Walia, Varinda.
  2. 2.0 2.1 Maitray, Mohan.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ReferenceA అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; faithandthearts.com అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు