శిఖండి మహాభారతంలో ఒక పాత్ర. మహాభారత యుద్ధంలో భీష్ముని అస్త్రసన్యాసానికి కారణమైన పాత్ర.

శిఖండి పూర్వ జన్మ వృత్తాంతం మార్చు

కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళు. అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా, భీష్ముడు తన తమ్ముడికి పెళ్ళి చేయాలనుకుని ఆ స్వయంవరానికి విచ్చేసాడు. స్వయంవరానికి వచ్చిన వారి మధ్య కలహాలు చెలరేగాయి. అపుడు భీష్ముడు అందరిని ఓడించి ఆ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురం తీసుకువచ్చి పెళ్ళి ఏర్పాట్లు చేయమన్నాడు.

అంబ వేడుకోలు మార్చు

అపుడు అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి "గాంగేయా! నా మనసంతా సాళ్వభూపతి మీద ఉంది. అతనే నా ప్రాణనాయకుడు. మనసు లేని మనువు క్షేమం కాదు. నన్ను సాళ్వుని దగ్గరకు చేర్చు, నా చెల్లెల్లిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లిచెయ్యి" అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబని సాళ్వదేశానికి పంపాడు.

అంబ శపథం మార్చు

సాళ్వుడు అంబని చేసుకోడానికి నిరాకరించాడు. "నువ్వంటే ఇష్టం ఉన్నా, వేరొకరు చేజిక్కించుకున్న విజయఫలాన్ని నేను అందుకోలేను" అని పరుషంగా వెళ్లిపొమ్మన్నాడు. తిరిగి హస్తిన కొచ్చిన అంబని భీష్ముడు కూడా నిరాకరించాడు. అపుడు అంబ నీ వలననే నా ఆశలన్ని నేలరాలాయి. నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నిన్ను నేనే సంహరిస్తాను అని శపథం చేసింది. "అంబా! నువ్వు ఏనాడు ఐతే అస్త్రం చేతపూని నా ఎదుట నిల్చెదవో అపుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను" అని భీష్ముడు కూడా ప్రతిన పూనాడు.

పరశురాముడి సహాయం మార్చు

తన మనుమరాలైన (కూతురు కూతురు) [1] అంబ విషయం తెలుసుకున్న హోత్రవాహనుడనే రాజర్షి తనను చూసేందుకు వచ్చిన పరశురాముడికి చెప్పి సహాయం చేయమని అడిగాడు. తన తపశ్శక్తితో ఒక వరమాలను చేసి "అంబా ఈ మాల ధరించిన వారి చేతిలోనే భీష్ముడి ఓటమి, తప్పదు". ఇదే నీకు చేయగల సహాయం అని చెప్పాడు. ఆ వరమాల ధరించే వారికోసం అంబ ఎందరినో అడిగి లేదనిపించుకొని చివరకు ద్రుపదుడిని మాల ధరించి భీష్ముడిని ఎదిరించమని వేడుకుంది. ద్రుపదుడు అందుకు ఒప్పుకొనక పోయేసరికి విసిగి కోపంతో ఆ వరమాలను కోటగుమ్మానికి వేలాడదీసి వెళ్ళిపోయి, ఆత్మాహుతి చేసుకుంది.

శిఖండి జననం మార్చు

ద్రుపదుడు సంతానం కోసం యాగం చేయగా అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు జన్మించారు. అందులో మొదటి సంతానంగా (పూర్వజన్మలోఅంబ) ఆడపిల్లగా జన్మించింది. అంబ అక్కడ కోటగుమ్మానికి ఉన్న వరమాలను తీసి తన మెడలో వేసుకుంది. అది చూసిన ద్రుపదుడు కోపోద్రేకంతో "భీష్ముడితో వైరమా!" అని అంబని తన రాజ్యం నుంచి వెళ్ళకొట్టాడు.

శిఖండి ప్రతిజ్ఞ మార్చు

అంబ తన ప్రతిజ్ఞ నేరవేరడంకోసం శివుడికోసం తపస్సుచేసి పురుషుడిగా మారింది. ఆ అంబనే "శిఖండి". మహాభారత యుద్ధంలో అర్జునుడిరథం ముందుభాగంలో శిఖండి అస్త్రం చేతబూని ఉండడం చూడగానే భీష్ముడు తన చేతిలోని అస్త్రం జారవిడిచాడు. అదను చూసి అర్జునుడు భీష్ముడిని హతమార్చాడు. ఆ విధంగా శిఖండి (అంబ) తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది.

బయటి లింకులు మార్చు

వనరులు, మూలాలు మార్చు

  1. "మహాభారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । తెలుగు భారతం । పాండవులు | అవధానం । సా". www.mahabharatapravachanam.org. Archived from the original on 2020-12-29. Retrieved 2020-12-29.
"https://te.wikipedia.org/w/index.php?title=శిఖండి&oldid=3087891" నుండి వెలికితీశారు