శ్రీరామ నరసింహమూర్తి కవులు

గంధం శ్రీరామమూర్తి, ఇఱ్ఱింకి నరసింహమూర్తి అనే ఇద్దరు కవులూ జంటగా శ్రీరామ నరసింహమూర్తి కవులు అనే పేరుతో జంటగా కవిత్వం చెప్పారు. శతావధానము చేశారు. గద్వాల సంస్థానములో ఆస్థానకవులుగా ఉన్నారు.[1]

గంధం శ్రీరామమూర్తి మార్చు

ఇతడు 1905లో పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి గ్రామంలో జన్మించాడు. ఇతడు ఉభయభాషాప్రవీణ పరీక్ష ఉత్తీర్ణుడయి పశ్చిమ గోదావరి జిల్లాలలోని పలు స్థానికోన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా పనిచేశాడు.

ఇఱ్ఱింకి నరసింహమూర్తి మార్చు

ఇతడు 1901లో పశ్చిమ గోదావరి జిల్లా తోలేరు గ్రామంలో జన్మించాడు. ఇతడు కూడా ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడై పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఉన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా పనిచేశాడు.

రచనలు మార్చు

వీరిరువురూ బహుగ్రంథకర్తలు. వీరి గ్రంథాలలో

  1. శతావధానము
  2. చాటువులు
  3. శ్రీమదాంధ్ర భాగవతము
  4. మణిరత్నమాల
  5. తేటగీత భగవద్గీత
  6. మహాభారత యుద్ధము
  7. తీర్థయాత్రాదర్శిని
  8. ఆంధ్రపుష్పబాణవిలాసము
  9. యదార్థ రామాయణము
  10. వేమగీతమ్‌ (సంస్కృతం)
  11. ప్రథమ సహస్రము
  12. బాపూజీ సూక్తి రత్నావళి
  13. మహాత్మాగాంధీ
  14. ఆశ్రిత పారిజాత శతకము మొదలైనవి ఉన్నాయి.

అవధానాలు మార్చు

వీరు చేసిన అవధానాలలో తోలేరులో చేసిన శతావధానము వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఈ అవధానములోని కొన్ని పూరణలు:

  • వర్ణన: నదిని స్త్రీతో పోల్చి పద్యం

పూరణ:

వేణి భరాభిరామ, యరవింద సముజ్వల నేత్ర, సైకత
శ్రోణియు, చక్రవాక కుచశోభిత, రాజ మరాళయానయై
ప్రాణవిభున్ తమిన్ గవయఁబాల్పడి యేగెడు కాంతకైవడిన్
రాణమెయిన్ స్రవంతి జలరాశిని గూడఁగ నేగుదెంచెడిన్

  • సమస్య: వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్

పూరణ:

ఈ క్త్రా ప్రాసముఁజెప్ప నద్భుతమొకో యేంతేనియున్, జూడుడీ
వాక్త్రాసంబుల జంకు వారమనుచున్ భావింపఁగా బోకుడీ
దిక్త్రారాతికిఁబార్వతీ శివులకున్ తిగ్మ ప్రభారాశికిన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్

  • సమస్య: మలము దినుము నీదు నోటి మలినము పోవున్

పూరణ:

చలువ కపురంపు పలుకులు
జలుబు మలపు జాజికాయ జాపత్రులు వ
క్కలు యేలకులం గూడు, త
మలము దినుము నీదు నోటి మలినము పోవున్

మూలాలు మార్చు

  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 233–236.