శ్రీ సూర్యరాయ శతకము

23 పేజీలలో 100 పద్యములు కల శ్రీ సూర్యరాయ శతకము[1] దేవగుప్తాపు భరద్వాజము చేత రచింపబడి 1916లో చెన్నపురి ఆంధ్రపత్రికాలయములో ముద్రింపబడింది. పిఠాపురం మహారాజా రావు సూర్యారావు దాతృత్వాన్ని వర్ణించి, కొన్ని నీతులు బోధింపబడిన ఈ శతకములో "సూర్యనృపా" అనే మకుటం కలదు. ఇది కాక కవి "సూర్యరాయ విబుధవిదేయా!" "సూర్యరాయ సజ్జనగేయా!" "సూర్యరూప! చిత్తజరూపా!" అని కూడా సంబోధించాడు. అపాత్రదానము పనికి రాదని, ప్రభువెన్నడు తనకున్నదంతయు వెచ్చింపరాదని, వెనుక ముందు చూచి ఇవ్వవలెనని కవి ఈ శతకము ద్వారా ప్రభువుకు హితబోధ చేశాడు.

శ్రీ సూర్యరాయ శతకము
కవి పేరుదేవగుప్తాపు భరద్వాజము
మొదటి ప్రచురణ తేదీ1916
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంసూర్యనృపా!
విషయము(లు)నీతిబోధ
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుకందపద్యాలు
ప్రచురణ తేదీ1916
మొత్తం పద్యముల సంఖ్య100
మొత్తం పుటలు23
అంకితంరావు సూర్యారావు
ముద్రాపకుని పేరుకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
ముద్రణా శాలఆంధ్రపత్రిక కార్యాలయము, చెన్నపురి
కం. పండితున కొక్కడబ్బిడఁ
గొండగు, మఱి వేనవేలు కొండీండ్రకిడన్
బెండగు పాత్రాపాత్రల్
ఖండితముగ నెంచి చూడ ఘనసూర్యనృపా!

మూలాలు మార్చు

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973