సింహేంద్రమధ్యమ రాగం

సింహేంద్రమధ్యమ రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 57వ మేళకర్త రాగము.[1][2] దీనిని కర్ణాటక సంగీతం ముత్తుస్వామి దీక్షితార్ పాఠశాలలో సుమద్యుతి అని అంటారు. ఇది కర్ణాటక సంగీతం నుండి హిందూస్థానీ సంగీతంలోకి అరువు తెచ్చుకున్నట్లు చెబుతారు.[3]

"సింహేంద్రమధ్యమ" scale with Shadjam at C

రాగ లక్షణాలు మార్చు

(S R2 G2 M2 P D1 N3 S)
(S N3 D1 P M2 G2 R2 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 21వ మేళకర్త రాగమైన కీరవాణి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు మార్చు

  • నీదు చరణములే - త్యాగయ్య
  • నిన్నే నమ్మితినయ్యా - మైసూరు వసుదేవాచారి
  • పన్నగేంద్రశయనా - త్యాగయ్య
  • కమలాక్షి కామకోటి పీఠ వాసిని - ముత్తుస్వామి దీక్షితులు
  • పామరజనపాలిని - ముత్తుస్వామి దీక్షితులు
  • అయ్యప్పా - జేసుదాస్
  • రామ రామ గుణసీమ - స్వాతి తిరునాళ్
  • మరకత సింహాసన - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
  • ఇహ పరం యెన్నుమ్‌ - మహా వైద్యనాథ అయ్యర్

తెలుగు సినిమా పాటలు మార్చు

1 ఈ నిరాధరణ భరించా శ్రీ వెంకటేశ్వర మహత్యం
2 నా తల గొట్టి పల్నాటి యుద్ధం (1947 సినిమా)

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras