సిటీ మ్యూజియం, హైదరాబాద్

సిటీ మ్యూజియం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో పురానీ హవేలీ అనే రాజభవనంలో ఉంది.[1] హైదరాబాదు నగర చరిత్రను తెలిపే అనేక అరుదైన వస్తువులు, కళాఖండాలతో నిజాం మ్యూజియంలోని ఒక విభాగంలో ఈ సిటీ మ్యూజియం ప్రారంభించబడింది.

సిటీ మ్యూజియం
Establishedమార్చి 11, 2012
Locationపురానీ హవేలీ, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

చరిత్ర మార్చు

ఈ మ్యూజియాన్ని 2012, మార్చి 11న నిజాం జూబ్లీయంట్ ట్రస్ట్ చైర్మన్, హైదరాబాద్ నగర నిజాం పాలకుల్లో చివరి వాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు ప్రిన్స్ ముఫ్ఫాఖాన్ షా ప్రారంభించాడు.[2] హైదరాబాదు పూర్వపు చరిత్రను భావి తరాలకు అందించాలనే తపనతో దీనిని ఏర్పాటు చేశారు.[3]

సందర్శకుల వేళలు మార్చు

ఈ మ్యూజియంలో సందర్శకులను ప్రతిరోజు ఉదయం 10:00గంటల నుంచి సాయంత్రం 5:00గంటల వరకు అనుమతిస్తారు.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Unveiling the past". Times of India. Archived from the original on 2013-02-21. Retrieved 13 March 2012.
  2. మన తెలంగాణ, హైదరాబాదు (4 April 2018). "ఉట్టిపడే రాజసం నిజాం మ్యూజియం..!!". Archived from the original on 17 October 2020. Retrieved 17 October 2020.
  3. https://www.hyderabadtourism.travel/nizam-museum-hyderabad