సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఆంగ్లం: Centre for Science and Environment) భారతదేశంలోని న్యూఢిల్లీ కేంద్రంగా ప్రజా ప్రయోజన పరిశోధన, న్యాయ రంగాలలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. దాని ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో కొన్ని ఆహార కల్తీ, వినియోగదారు ఉత్పత్తుల భద్రతను పరిశోధించడం వంటివి ఉన్నాయి.[2][3]

సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెంటర్
సంకేతాక్షరంసీఎస్ఈ
స్థాపన1980 (1980)
వ్యవస్థాపకులుఅనిల్ అగర్వాల్
రకంప్రజా ప్రయోజన పరిశోధన
కార్యస్థానం
సేవా ప్రాంతాలుభారతీదేశం
ముఖ్యమైన వ్యక్తులుసునీతా నారాయణ్[1]
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ సునీతా నారాయణ్ పార్లమెంట్ సభ్యులతో 'నీటి సంరక్షణ' ఉపన్యాసం

1980లో ఏర్పాటైన సీఎస్ఈ దేశంలో పర్యావరణ అభివృద్ధి సమస్యలు, పేలవమైన ప్రణాళిక, దేశంలోని సుందర్‌బన్‌లను నాశనం చేస్తున్న వాతావరణ మార్పులు, విధాన మార్పులు, ఇప్పటికే ఉన్న విధానాలను మరింత మెరుగ్గా అమలు చేయడం కోసం కృషిచేస్తుంది.

ఈ సెంటర్ డైరెక్టర్ సునీతా నారాయణ్ కాగా, ఆమె నాయకత్వంలో, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కోక్, పెప్సీ వంటి అమెరికన్ బ్రాండ్‌ల శీతల పానీయాలలో ఉన్న అధిక స్థాయి పురుగుమందులను బహిర్గతం చేసింది.[4]

2018లో సీఎస్ఈకి శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి లభించింది.[5][6]

మూలాలు మార్చు

  1. https://www.cseindia.org/page/directors-cse
  2. "Honey adulteration: CSE rebuts Chinese firm's claim". The Hindu Business Line (in ఇంగ్లీష్). 9 December 2020. Archived from the original on 11 December 2020. Retrieved 2021-01-04.
  3. "After new quality control rule, toy safety finally set to become a reality in India". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-01-02. Retrieved 2021-01-04.
  4. "Pesticide cocktail in Coke, Pepsi brands". The Economic Times.
  5. "Centre for Science and Environment to receive Indira Gandhi Prize | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 18 November 2019. Archived from the original on 24 February 2022. Retrieved 2021-01-04.
  6. https://www.cseindia.org/cse-gets-2018-indira-gandhi-prize-9149>