అగ్నికులక్షత్రియులు
waiting for results
అగ్ని కుల క్షత్రియులు | |
---|---|
వర్గీకరణ | ఇతర వెనుకబడిన తరగతులు (ఆంధ్రప్రదేశ్) |
జనాభా గల రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ |
Reservation (Education) | BC-A |
అగ్నికులక్షత్రియులు అనే కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఏ విభాగానికి చెందుతారు.[1] నేడు ఆంధ్ర ప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్టా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఎక్కువగా వీరు తీరా ప్రాంతాలలో నివసిస్తారు.
ప్రస్తుత సామజిక పరిస్థితి
మార్చునేడు అగ్నికులక్షత్రియ కులం నిరక్షరాస్యత,అనైక్యతగా ఎవరికీ వారీగా వుంటూ పార్టీలుగా వర్గాలుగా విడి విడిగా ఉండటం వలన అన్ని రంగాలలో వెనకబడిపోయారు. అధికశాతం కోస్తా తీరా ప్రాంతంలో చేపల పెంపకం, చేతి వృత్తులు చేసుకుంటూ నిరంతరం జీవిత పోరాటం చేస్తున్నారు.
సమస్యలు
మార్చు- ప్రపంచ ప్రఖ్యాత చెందిన దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని, కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలని నిర్మించింనది అగ్నికులక్షత్రియ కులస్తులు.[2]
- కోపనాతి కృష్ణమవర్మ, పెనబోతూ గజేంద్రుడు ఈ ఆలయాల నిర్మించారు.కానీ ధర్మకర్తలుగా వేరే కులస్తులు ఉంటున్నారు. ఆలయ ధర్మకర్తల వీరి కులస్తులు ఉండేలా వీరి కుల సంఘం ఎప్పటినుంచో పోరాటం చేస్తుంది.
ఆచార వ్యవహారాలు
మార్చుఅగ్నికులక్షత్రియులకు ఉపనయనము, యజ్ఙోపవీతం ఆచారం ఉంది. వివాహానికి ముందు ఉపనయనం చేసుకుంటారు. వీరి కులస్తులు అందరూ హిందూ మతాన్ని అందులో వైష్ణవాచారమును (నిలువు బొట్టుతో) ఆచరిస్తూ ఉంటారు. వీరు పూర్వము వైష్ణవ బ్రహ్మణులు, వీరందరికీ ఓకే గోత్రము ఉంటుంది అదే 'రఘుకుల గోత్రం'.ఓకే కుటుంబములో గల నలుగురు అన్నదమ్ములను అగ్ని హోమము ద్వారా దేశ రక్షణ కోసం హోమము చేసి నలు దిక్కులా పంపబడినారు కనుక అగ్నికులక్షత్రియులుగా పేరు వచ్చింది. ఇప్పుడు ఉన్న అగ్నికులక్షత్రియులు అందరూ ఓకే కుటుంబ మూలము కనుక ఒకటే గోత్రము అయిన రఘుకుల గోత్రములో ఉంటారు.భారతదేశంలో గుడులు కట్టి విగ్రహరాదనను ఆచరణలోకి తెచ్చి నదే ఈ అగ్నికులక్షత్రియులు. యుద్ధములో శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యమునకు దూరముగా జీవిస్తున్నారు కనుక వీరు విద్యా అభివృద్ధికి దూరమై వెనుక పడిపోయారు.నౌకా యానంపై పట్టు ఉండటం వలన నదులలో చేపలు పట్టి జీవిస్తున్నారు.
ప్రముఖులు
మార్చు- కొపనాతి కృష్ణమ్మ- అంతర్వేది ఆలయ నిర్మాత.
- మల్లాడిసత్యలింగంనాయకర్ - MSN చారిటీస్ విద్యావేత్త.
- పినపోతు గజేంద్రుడు - వాడపల్లి ఆలయ నిర్మాత.
- పెదసింగు లక్ష్మణరావు - కులం మీద మత్స్యకార ముద్రవేసిన నాయకుడు
మూలాలు
మార్చు- ↑ "National Commission for Backward Classes". www.ncbc.nic.in. Retrieved 2023-05-17.
- ↑ "Lakshmi Narasimha Swamy Temple, Antarvedi, Andhra Pradesh". hindupost.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-22. Retrieved 2023-05-17.