అభినంద్ కుమార్ షావిలి

అభినంద్‌ కుమార్‌ షావిలి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 1993 నుంచి న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించి 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]

అభినంద్ కుమార్ షావిలి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 జనవరి 2019 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 8 అక్టోబర్‌ 1963
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
తల్లిదండ్రులు సుబ్బారావు, యశోద
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం మార్చు

అభినంద్‌ కుమార్‌ షావిలి 8 అక్టోబరు 1963లో సుబ్బారావు, యశోద దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు సికింద్రాబాద్ లోని సెయింట్ జాన్స్ గ్రామర్ స్కూల్, నృపతుంగ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, నిజాం కాలేజీ నుండి బి.ఎస్సీ (డిగ్రీ), ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా కాలేజ్ నుండి ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం మార్చు

అభినంద్‌ కుమార్‌ షావిలి ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1989లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కొంతకాలం న్యాయవాది డి.లింగారావు వద్ద జూనియర్‌గా పనిచేసి, తర్వాత విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు పనిచేశాడు. ఆయన 1993 ఫిబ్రవరి 02నుండి సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించాడు. అభినంద్‌ కుమార్‌ షావిలి 2017 సెప్టెంబరు 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[3] ఆయన 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[4]

మూలాలు మార్చు

  1. The Times of India (2 January 2021). "13-judge strong Telangana HC will sit from Wednesday" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  2. Telangana High Court (2021). "HONOURABLE SRI JUSTICE ABHINAND KUMAR SHAVILI". Archived from the original on 25 January 2020. Retrieved 21 October 2021.
  3. Sakshi (2 January 2019). "కొలువుదీరిన కొత్త హైకోర్టు". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  4. ETV Bharat News (14 July 2023). "Telangana HC Incharge CJ : హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నవీన్‌రావు". ETV Bharat News. Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.