అశోకచక్రం (ఆంగ్లం : Ashoka Chakra), ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) గలవు. ఈ చక్రం గురించి, మౌర్య సామ్రాజ్యంలో అనేక కథనాలున్నవి. అశోక చక్రవర్తి (273 - 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్తంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటుచేసుకున్నది. దీనిని 1947 జూలై 22 న, పొందుపరచారు. ఈ అశోకచక్రం, తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో 'నీలి ఊదా' రంగులో గలదు.

భారత జాతీయపతాకంలో గల 'అశోకచక్రం', దాని వివరాలు.
ప్రఖ్యాత 'సాండ్-స్టోన్' (ఇసుకరాయి) లో చెక్కబడిన 'నాలుగు సింహాల' చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో గలదు. ఇది అశోక స్తంభం పైభాగాన గలదు. దీని నిర్మాణ క్రీ.పూ. 250లో జరిగింది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.

అర్థం

ఇవీ చూడండి సవరించు

బయటి లింకులు సవరించు