ఆడెపు చంద్రమౌళి
ఆడెపు చంద్రమౌళి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు జిల్లా కు చెందిన కవి. 1939లో జన్మించిన చంద్రమౌళి 2009లో మరణించాడు. పద్య సాహిత్యంలో విశేష కృషి చేశాడు. రామాయణ రమణీయం, వేములవాడ రాజరాజేశ్వర శతకం, శ్రీశ్రీనివాస బొమ్మల శతకం ఇతని రచనలు. ఇతను రచించిన శ్రీశ్రీనివాస బొమ్మల శతకంలోని పద్యాలను తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రచురించిన 7 వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది[1]. సాహిత్యంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాను పొందాడు. ఇతని రచనలను టి.శ్రీరంగస్వామి ఆధ్వర్యంలో నడపబడుచున్న వరంగల్ వారి శ్రీలేఖ సాహితి సంస్థ పద్య మణిహారం పేరుతో 2012లో ప్రచురించింది.
ఆడెపు చంద్రమౌళి | |
---|---|
జననం | ఆడెపు చంద్రమౌళి ఏప్రిల్ 7, 1939 |
మరణం | సెప్టెంబర్ 28, 2009 వరంగల్లు జిల్లా |
ప్రసిద్ధి | కవి |
మతం | హిందూ మతము |
రచనలుసవరించు
- రామాయణ రమణీయం (పద్యకావ్యం)
- వేములవాడ రాజరాజేశ్వర శతకం
- శ్రీశ్రీనివాస బొమ్మల శతకం
శ్రీశ్రీనివాస బొమ్మల శతకంలోని ఒక పద్యం...
ఆ.వె.
సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము
విశ్వశాంతి కోరు విజ్ఞానమే యిమ్ము
చిద్విలాస భాస! శ్రీనివాస!
మూలాలుసవరించు
- ↑ నవ వసంతం-2, 7 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015, పుట-22