ఆదిచనల్లూర్

తమిళనాడులోని పురావస్తు ప్రదేశం


తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఆది చనల్లూర్ పురావస్తు మ్యూజియానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ఆగస్టు 5న శంకుస్థాపన చేసింది[1]. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో తామిరబణి నదికి సమీపంలో ఉన్న 114 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండపై దీన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఏఎస్ఐ ఆధ్వర్యంలో ఆన్సైట్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. తవ్వకాల్లో బయల్పడిన సుమారు 3,800 సంవత్సరాల నాటి కుండలు, కళాఖండాలు, అస్థిపంజరం వంటి వాటి పైన అద్దాలు అమర్చారు.

మూలాలు మార్చు

  1. PTI. "Nirmala Sitharaman lays foundation stone for archeological museum in Tamil Nadu's Adichanallur". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.

వెలుపలి లంకెలు మార్చు