ఇసాక్‌ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 11 నవంబర్ 2021న ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యాడు.[1][2]

ఇసాక్‌బాషా

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 నవంబర్ 2021 - 22 నవంబర్ 2027

వ్యక్తిగత వివరాలు

జననం 4 జూన్ 1962
నంద్యాల, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జాఫర్‌ హుస్సేన్, జహ్నాబీ
జీవిత భాగస్వామి రహ్మద్‌ బీ
సంతానం ఫిరోజ్‌ బాషా, హర్షద్‌
పూర్వ విద్యార్థి బీకాం
మతం ముస్లిం మతము

జననం, విద్యాభాస్యం మార్చు

ఇసాక్‌ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలలో 4 జూన్ 1962లో జాఫర్‌ హుస్సేన్, జహ్నాబీ దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదివాడు.[3]

రాజకీయ జీవితం మార్చు

ఇసాక్‌ బాషా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాడు. ఆయన 2018లో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయనను 11 నవంబర్ 2021న ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆయనకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నవంబర్ 16న బీఫాం అందజేయగా సెక్రటేరియట్‌ లో నామిషన్‌ దాఖలు చేశాడు.[4]

మూలాలు మార్చు

  1. Sakshi (11 November 2021). "ముగ్గురు ఎమ్మెల్సీల ఖరారు". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  2. Andrajyothy (10 November 2021). "ఎమ్మెల్సీగా ఇసాక్‌బాషా". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  3. Sakshi Post (16 November 2021). "AP CM YS Jagan Hands Over B-forms To MLC Candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  4. TV9 Telugu, TV9 (16 November 2021). "ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం వైఎస్ జగన్‌". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)