ఎలకూచి పినయాదిత్యుడు

ఎలకూచి పినయాదిత్యుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. ఇతను సుప్రసిద్ధ కవి ఎలకూచి బాలసరస్వతికి స్వయాన తమ్ముడు.[1] ఇతని తండ్రి కృష్ణ దేవుడు, తాత భైరవార్యుడు. ఇతనికి ఎలకూచి పిన్నయ ప్రభాకరుడు అని మరో పేరు కూడా ఉంది. ఈ కవి సా.శ. 17 వ శతాబ్దికి చెందినవాడు. మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు ప్రాంతానికి చెందినవాడు. అన్న ఎలకూచి బాల సరస్వతి ఈ సంస్థానంలోనే ఆస్థాన కవిగా కొనసాగాడు. పినయదిత్యుడు కూడా అన్న వలె విద్వత్కవే. ఆంధ్ర, గీర్వాణ విద్వాంసుడు. పలు రచనలు చేసినా, ఆదిత్య పురాణం అను గ్రంథం మాత్రం వెలుగులోకి వచ్చింది.

ఎలకూచి పినయాదిత్యుడు
జననంఎలకూచి పిన్నయ ప్రభాకరుడు
17 వ శతాబ్ది
మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు
ఇతర పేర్లుఎలకూచి పిన్నయ ప్రభాకరుడు
ప్రసిద్ధికవి
మతంహిందూ
తండ్రికృష్ణ దేవుడు

రచనలు మార్చు

  • ఆదిత్య పురాణం

ఇవీ చూడండి మార్చు

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. ముసునూరి వేంకటశాస్త్రి: విద్యార్థి కల్ప తరువు, రెండవ సంపుటం,వెంకట్రామ & కో. మద్రాస్,1967, పుట-635