ఎల్లాళను (తమిళం: எல்லாளன்; (సింహళంలో එළාර) సాంప్రదాయకంగా సింహళీయులచే కూడా న్యాయమైన రాజుగా ప్రదర్శించబడ్డాడు. చోళవంశ రాజైన ఆయన " మను నీది చోళను " గా ప్రశంశించబడ్డాడు. ఆయన సింహాసం అధిష్టించగానే శ్రీలంక రాజధాని అయిన అనూరాధపురం రాజయ్యాడు(క్రీ.పూ.205 నుండి క్రీ.పూ.161 వరకు).ఆయన తన కుమారుడిని ఘోరమైన నేరం ఆధారంగా ఉరితీయాలని ఎలా ఆదేశించాడో వివరిస్తుంది.[2][3][4]

ఎల్లాళను
Statue of Ellāḷaṉ in the premises of Madras High Court in Chennai
King of Anuradhapura
Reignసుమారు 205 –  161 BC
PredecessorAsela
SuccessorDutugamunu
జననం235 BCE
మరణం161 BCE
IssueVeedhividangan[1]
రాజవంశంChola Dynasty
మతంHinduism, Shaivism

ఎల్లాళను రాజును శ్రీలకీయులు " జస్టు కింగు " అంటారు.[5] మవంశం అనే గ్రంధం ఆయన " స్నేహితుడికి, శత్రువు " కు కూడా సమానమైన న్యాయనిర్ణయం చేసాడు.[6] ఆయన నేరం చేసిన తన కుమారుడుకి మరణశిక్ష విధించి అసమాన న్యాయనిర్ణేతగా చారిత్రక ఖ్యాతిగాంచాడు.

ఎల్లాళను శ్రీలంక చరిత్రలో ఒక విచిత్రమైన వ్యక్తి. దేశంలో కలహాలకు, ఆక్రమణకు ఆయన కారణం అయినప్పటికీ, పురాతన సింహళీ పాలి క్రానికలు మహావంశంలో ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా ఆయన తరచుగా శ్రీలంక తెలివైన, న్యాయమైన రాజులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

క్రానికలు ఆధారంగా ఎల్లాళను శత్రువైన దుతుగామును కూడా ఆయన మీద ఎంతో గౌరవం కలిగి ఉన్నాడు. యుద్ధంలో మరణించిన తరువాత ఎల్లాళను దహన సంస్కారాలు జరిపిన చోట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని ఆదేశించాడు. దఖినా స్థూపం ఎల్లాళను సమాధి అని విశ్వసిస్తున్నారు. తరచుగా 'జస్టు కింగు ' అని పిలుస్తారు. తమిళ పేరు ఎల్లాళను అంటే 'సరిహద్దును శాసించేవాడు' అని అర్ధం.

జననం, ఆరంభకాల జీవితం మార్చు

ఎల్లాళను మహావంశంలో "గొప్ప సంతతికి చెందిన తమిళం .... చోళ దేశం నుండి" అని వర్ణించబడింది;[6] ఆయన ప్రారంభ జీవితం గురించి చాలా తక్కువగా తెలుసు. క్రీస్తుపూర్వం 205 లో ఎల్లాళను ఉత్తర శ్రీలంకలోని అనురాధపురం కేంద్రంగా పనిచేస్తున్న రాజారత మీద దాడి చేసి అనురాధపుర రాజు అసేలా బలగాలను ఓడించి రాజరాత ఏకైక పాలకుడిగా స్థిరపడ్డాడు.

ఆయన సిలప్పధికారం, పెరియ పురాణంలో ప్రస్తావించబడ్డాడు.[7] అప్పటి నుండి ఆయన పేరు న్యాయానికి ప్రతిరూపంగా ఉపయోగించబడింది.

ఓటమి, మరణం మార్చు

ఎల్లాళను ప్రఖ్యాత సమాన పాలన ఉన్నప్పటికీ ఆయనకు మహాగామ రాజ్యానికి చెందిన యువ సింహళ యువరాజు దుతుగుము నుండి ఆయనకు ప్రతిఘటన ఉంది. ఎల్లాళను పాలన ముగిసే సమయానికి తనతో సవాలు చేసిన తన సొంత సోదరుడు సద్దా టిస్సాను ఓడించి దుతుగుమును దక్షిణాన తన స్థానాన్ని బలపరిచాడు. ఇద్దరు చక్రవర్తుల మధ్య ఘర్షణ అనివార్యం, ఎల్లాళను పాలన చివరి సంవత్సరాలు ఇద్దరి మధ్య యుద్ధానికి వినియోగించబడింది. యువ దుతుగామునుతో యుద్ధం జరిగినప్పుడు ఎల్లాళను డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నాడు.[8]

మహావంశంలో ముట్టడి, ఘర్షణల సమయంలో జరిగిన యుద్ధాల గురించి చాలా వివరంగా ఉంది.[5] ముఖ్యంగా యుద్ధ ఏనుగుల విస్తృతమైన ఉపయోగం యుద్ధాలలో అగ్నిగుండం ఆసక్తికరంగా ఉంటుంది. ఎల్లాళనుకు స్వంతమైన యుద్ధ ఏనుగు మహా పబ్బత ('బిగ్ రాక్') అని, దుతుగుమును స్వంత ఏనుగు పేరు 'కందుల' అని సూచించబడింది.[9]

దుతుగుము ​​అనురాధపురం దగ్గరికి రావడంతో చివరి యుద్ధం జరిగిందని పేర్కొన్నారు. ముందు రోజు రాత్రి ఎల్లాళను రాజు, యువరాజు దుతుగామును ఇద్దరూ తమ సలహాదారులతో సమావేశమైనట్లు పేర్కొనబడింది. మరుసటి రోజు రాజులు ఇద్దరూ యుద్ధ ఏనుగుల మీద ముందుకు సాగారు. ఎల్లాళను "పూర్తి కవచంతో .... రథాలు, సైనికులు, స్వారీచేయడానికి జంతువులతో". దుతుగుమును దళాలు ఎల్లాళను దళాలను ఎదుర్కొన్నాయి. "అక్కడ ఉన్న సరోవరంలోని నీరు చంపబడిన వారి రక్తంతో ఎర్రగా రంగులు వేసుకున్నాయి" అని పేర్కొన్నారు. 'దుతుగుమును,' ఎల్లాళనును ఎవరూ చంపకూడదు స్వయంగా నేను కూడా" అని ప్రకటించి, అనురాధపురంలో ఆయన మీద దక్షిణ ద్వారం వద్ద మూసివేశారు , ఇద్దరూ ఏనుగు-మీద ద్వంద్వ పోరాటంలో నిమగ్నమయ్యారు. వృద్ధుడైన రాజు చివరకు దుతుగామును బాణాలలో ఒకటి చేత కొట్టబడ్డాడు.[8]

 
19 వ శతాబ్దం వరకు, దఖినా స్థూపం ఎల్లాళను సమాధి అని విశ్వసిస్తారు

అతని మరణం తరువాత, దుతుగామును ఎల్యాళనును ఆయన పడిపోయిన చోట దహనం చేయాలని ఆదేశించాడు. ఈ స్థలంలో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. మహావంశం 'ఈ రోజు వరకు లంక రాకుమారులు ఈ ప్రదేశానికి చేరుకున్నప్పుడు, వారి సంగీతాన్ని నిశ్శబ్దం చేయటం లేదు' అని పేర్కొన్నారు. దఖినా స్థూపం 19 వ శతాబ్దం వరకు ఎల్లాళను సమాధి అని విశ్వసిస్తున్నారు. దీనిని ఎలారా సోహోనా అని పిలుస్తారు. కాని తరువాత శ్రీలంక పురావస్తు శాఖ దీని పేరు మార్చారు.[10][11] గుర్తింపు, పునః వర్గీకరణ వివాదాస్పదంగా పరిగణించబడుతుంది.[12]

ప్రభావం మార్చు

మహావంశంలో చోళ సామ్రాజ్యం విశ్వసనీయ దళాల గురించి అనేక సూచనలు ఉన్నాయి. వాటిని శక్తివంతమైన శక్తిగా చిత్రీకరిస్తాయి. మొదటి పరాక్రమబాహు పోలోన్నారువాకు చెందిన మొదటి విజయబాహు కాలంలో వారు దేవాలయాలను అదుపులోకి తీసుకోవడం సహా వివిధ పదవులు నిర్వహించారు.[13][14] సింహళ రాజులు వారిని చాలా మంది హార్డ్కోరు సమరయోధుల పేరును మహాతంత్రగా పేరు మార్చడం ద్వారా వారిని కిరాయి సైనికులుగా నియమించడానికి ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. చరిత్రకారుడు బర్టను స్టెయిను అభిప్రాయం ఆధారంగా ఈ దళాలు చోళ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నడిపించబడినప్పుడు వారు తిరుగుబాటు చేసి అణచివేయబడి తొలగించబడ్డారు. కానీ జీవనోపాధి కోసం వివిధ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా అవి నిష్క్రియాత్మక స్థితిలో ఉన్నాయి.[15] వెలైక్కార దళాలలో ఉపవిభాగమైన వలంజయర సమాజం వారు కాలక్రమేణా వ్యాపారులుగా మారి చాలా శక్తివంతమైనవారికి దంతాల అవశిష్టాల మందిరం వారి సంరక్షణకు అప్పగించబడింది.[16][17] వెలైక్కర దళాలు దంత-అవశిష్ట మందిరాన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు, వారు దీనిని మున్రుకై-తిరువలైక్కరను దలాది పెరుపల్లి అని పేరు మార్చారు.[18] వెలైక్కర దళాల బహుళ ఎపిగ్రాఫికు రికార్డులు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇది వారి శాసనాలు, ఉదాహరణకు పొలున్నారులోని సింహళ రాజుల పాలన పొడవును పరిష్కరించడానికి ఉపయోగిస్తారు; ఈ సందర్భంలో మొదటి విజయబాహు I (55 సంవత్సరాలు).[19]

జాఫ్నాలోని కరైనాగరు లోని శ్రీలంక నేవీ నార్తర్ను నావలు కమాండు బేసు పేరును ఎస్.ఎస్.ఎన్.ఎస్. ఎలారా.[20]

మను నీది చోళుడి పురాణ కథనం మార్చు

 
మనునీదిచోళుడి గంట, ఆవు

ఎల్లాళను "మను నీధి చోళను" (మను చట్టాలను అనుసరించే చోళుడు) అనే బిరుదును అందుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఆవుకు న్యాయం చేయటానికి తన సొంత కొడుకును ఉరితీశాడు. న్యాయం అవసరమయ్యే ఎవరికైనా రాజు తన న్యాయస్థానం ముందు ఒక పెద్ద గంటను వేలాడదీసినట్లు పురాణ కథనం వివరిస్తుంది. ఒక రోజు ఆయన ఒక ఆవు చేత గంట మోగడం విన్నప్పుడు బయటకు వచ్చాడు. విచారణలో ఆ ఆవు దూడ తన కొడుకు రథం చక్రాల క్రింద చంపబడిందని ఆయన కనుగొన్నాడు. ఆవుకు న్యాయం చేయటానికి ఎల్లాళను తన సొంత కుమారుడు వీధివిదంగనును రథం కింద తన సొంత శిక్షగా చంపాడు. అనగా ఎల్లాళను తనకు తాను శిక్షించుకుని ఆవుతో సమానంగా బాధను అనుభవించాడు.[1] రాజు న్యాయం చూసి ముగ్ధుడైన శివుడు ఆయనను ఆశీర్వదించి దూడను, కొడుకును సజీవంగా తీసుకువచ్చాడు. ఆయన సిలప్పధికారం, పెరియ పురాణంలో ప్రస్తావించబడ్డాడు.[7] అప్పటి నుండి ఆయన పేరు తమిళ సాహిత్యంలో న్యాయం కోసం ఒక రూపకంగా ఉపయోగించబడింది. ఆయన రాజధాని తిరువారూరు.

మహావంశ తన బండిని నడుపుతున్నప్పుడు అనుకోకుండా ఒక చెటియాను (స్థూపం) కొట్టాడని కూడా చెప్తాడు. ఆ తరువాత తనను చంపమని తన మంత్రులను ఆదేశించారు. కాని మంత్రులు బుద్ధుడు అలాంటి చర్యను ఆమోదించరని సమాధానం ఇచ్చారు. నష్టాన్ని సరిచేయడానికి ఏమి చేయాలో రాజు అడిగాడు. నిర్మాణాన్ని మరమ్మతు చేస్తే సరిపోతుందని వారు చెప్పారు. ఆయన ఆ పని పూర్తి చేసాడు. [21]

యాళ్పాన వైపవ మలై వంటి చరిత్రలు, కొనేసరు కల్వెట్టు(రాతి శాసనం) వంటి రాతి శాసనాలు పూర్వ చోళ రాజు, మను నీది చోళను వారసుడు కులక్కొట్టను 438 లో త్రికోణమలీ వద్ద శిధిలమైన కోనేశ్వరం ఆలయం కోనేరును పునరుద్ధరించాడని, పశ్చిమ తీరంలోని మున్నేశ్వరం ఆలయం నిర్మించాడని, ఈళం ద్వీపానికి తూర్పున పురాతన వన్నియార్లను స్థిరపరిచిన రాజుగా ఆయన ప్రసిద్ధి చెందాడు.[22][23]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "From the annals of history". The Hindu. India. 25 జూన్ 2010.
  2. "The Five Kings". mahavamsa.org. Archived from the original on 15 ఏప్రిల్ 2013. Retrieved 21 సెప్టెంబరు 2015.
  3. "Early history (from 250 BCE – 1000 CE)". Ceylon Tamils. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 21 సెప్టెంబరు 2015.
  4. "Elāra". palikanon.com. Retrieved 21 సెప్టెంబరు 2015.
  5. 5.0 5.1 "Chapter XXV". lakdiva.org.
  6. 6.0 6.1 "Chapter XXI". lakdiva.org.
  7. 7.0 7.1 "Tiruvarur in religious history of Tamil Nadu". The Hindu. Chennai, India. 16 జూలై 2010. Archived from the original on 18 జూలై 2010.
  8. 8.0 8.1 Obeyesekere, Gananath (27 నవంబరు 1990). The Work of Culture: Symbolic Transformation in Psychoanalysis and Anthropology (in ఇంగ్లీష్). University of Chicago Press. p. 172. ISBN 978-0-226-61598-1.
  9. "War Against King Elara". mahavamsa.org. Archived from the original on 16 డిసెంబరు 2017. Retrieved 15 డిసెంబరు 2017.
  10. Archaeological Department Centenary (1890–1990): History of the Department of Archaeology (in ఇంగ్లీష్). Commissioner of Archaeology. 1990. p. 171.
  11. McGilvray, Dennis B. (1993). Reviewed Work: The Presence of the Past: Chronicles, Politics, and Culture in Sinhala Life.by Steven Kemper. The University of Colorado Boulder: The Journal of Asian Studies. p. 1058. JSTOR 2059412.
  12. Indrapala, K. The Evolution of an ethnic identity: The Tamils of Sri Lanka, p. 368
  13. The tooth relic and the crown, page 59
  14. Epigraphia Zeylanica: being lithic and other inscriptions of Ceylon, Volume 2, page 250
  15. Journal of Tamil studies, Issues 31-32, page 60
  16. The Ceylon historical journal, Volumes 1-2, page 197
  17. Culavamsa: Being the More Recent Part of Mahavamsa
  18. Early South Indian temple architecture: study of Tiruvāliśvaram inscriptions, page 93
  19. Ceylon journal of historical and social studies, Volume 2, page 34
  20. "SLNS Elara conducts Medical and Dental Clinic at Karainagar". Archived from the original on 13 అక్టోబరు 2019. Retrieved 14 నవంబరు 2019.
  21. "King Elara (204 BC – 164 BC)". mahavamsa.org. 28 మే 2008. Retrieved 1 మార్చి 2017.
  22. Hellmann-Rajanayagam, Dagmar (1994). "Tamils and the meaning of history". Contemporary South Asia. Routledge. 3 (1): 3–23. doi:10.1080/09584939408719724.
  23. Schalk, Peter (2002). "Buddhism Among Tamils in Pre-colonial Tamilakam and Ilam: Prologue. The Pre-Pallava and the Pallava period". Acta Universitatis Upsaliensis. Uppsala University. 19–20: 159, 503. The Tamil stone inscription Konesar Kalvettu details King Kulakottan's involvement in the restoration of Koneswaram temple in 438 A.D. (Pillay, K., Pillay, K. (1963). South India and Ceylon);

వెలుపలి లింకులు మార్చు

ఎల్లాళను
చోళరాజ వంశం
Born: ? క్రీ.పూ 235 BC Died: ? క్రీ.పూ.161
Regnal titles
అంతకు ముందువారు
అసేల
అనూరాధపుర రాజు
క్రీ.పూ.205 క్రీ.పూ.–161
తరువాత వారు
దుతగామని
"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్లాళను&oldid=4147233" నుండి వెలికితీశారు