ఆంజల కుప్పుస్వామి చిన్నికృష్ణ నటరాజన్ (జననం 30 మే 1931) ఒక కర్ణాటక సంగీత క్లారినెట్ విద్వాంసుడు. ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని అలత్తూర్ వెంకటేశ అయ్యర్ వద్ద, నాదస్వరాన్ని ఇలుప్పుర్ నటేశపిళ్ళై వద్ద నేర్చుకున్నాడు.[1] నాదస్వర పండితుడు టి.ఎన్.రాజరత్నంపిళ్ళై ఇతడిని "క్లారినెట్ ఎవరెస్ట్"గా అభివర్ణించాడు.[2]మద్రాసు సంగీత అకాడమీ 2008లో ఇతనికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1994లో సంగీత నాటక అకాడమీ అవార్డు ఇతడిని వరించింది.[3] తిరుచిరాపల్లి లోని నాదద్వీపం ట్రస్టు ఇతడిని "నాదద్వీప కళానిధి" బిరుదుతో గౌరవించింది.[4] 2019లో శ్రీపురం శ్రీనారయణీ పీఠం ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. ఇతడు ఆకాశవాణి నిలయవిద్వాంసునిగా పలుసార్లు ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలు చేశాడు.

ఎ.కె.సి.నటరాజన్
వ్యక్తిగత సమాచారం
జననం (1931-05-30) 1931 మే 30 (వయసు 92)
తిరుచిరాపల్లి, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వాయిద్యాలుక్లారినెట్

ఆయనకు 2022లో పద్మశ్రీ పౌర పురస్కారం లభించింది. [5]

మూలాలు మార్చు

  1. "A.K.C. Natarajan to be honoured with 'Sangita Kalanidhi' title". The Hindu. Archived from the original on 2 ఆగస్టు 2013. Retrieved 2 August 2013.
  2. Nahla Nainar (20 June 2020). "AKC Natarajan: A decades-old bridge between the clarinet and Carnatic music". The Hindu. Retrieved 2 March 2021.
  3. "list of awardee". Sangeet Natak Academy. Archived from the original on 30 మే 2015. Retrieved 2 మార్చి 2021.
  4. "AKC Natarajan honoured". The Hindu. Archived from the original on 2 ఆగస్టు 2013. Retrieved 2 August 2013.
  5. Nainar, Nahla (2022-02-03). "Maestro A.K.C. Natarajan: 'Many before me have gone unsung'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-02-13.