కంచిరెడ్డి సురేష్ రెడ్డి

కంచిరెడ్డి సురేష్ రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1][2]

కంచిరెడ్డి సురేష్ రెడ్డి
కంచిరెడ్డి సురేష్ రెడ్డి


పదవీ కాలం
02 మే 2020 – ప్రస్తుతం
సూచించిన వారు శరద్ అరవింద్ బాబ్డే
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 7 డిసెంబర్‌ 1964
తరిమెల గ్రామం, శింగనమల మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు శంకర్‌రెడ్డి, లక్ష్మీదేవమ్మ
పూర్వ విద్యార్థి గుల్బర్గా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం మార్చు

కె.సురేష్‌ రెడ్డి 7 డిసెంబరు 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, శింగనమల మండలం, తరిమెల గ్రామంలో కె.శంకర్‌రెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అనంతపురం ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేసి కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1989 సెప్టెంబరులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[3]

వృత్తి జీవితం మార్చు

కె.సురేష్‌ రెడ్డి 1989లో సీనియర్‌ న్యాయవాది టి.బాల్‌రెడ్డి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి తర్వాత సొంతంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఆయన హైకోర్టులో క్రిమినల్‌ లా, సివిల్, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 2020 ఏప్రిల్ 21న నియమితుడై, 2020 మే 02న బాధ్యతలు చేపట్టాడు.[4]

మూలాలు మార్చు

  1. The Hindu (2 May 2020). "Three sworn in as High Court judges" (in Indian English). Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  2. Sakshi (2 May 2020). "హైకోర్టులో ముగ్గురు జడ్జిల నియామకం". Sakshi. Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  3. Sakshi (21 April 2020). "హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  4. The New Indian Express (3 May 2020). "3 sworn in as HC judges". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.