కుందా సత్యనారాయణ

కుందా సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త. ఆయన యాదాద్రి పుణ్యక్షేత్రంకి సమీపంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త.

కుందా సత్యనారాయణ
జననం
కుందా సత్యనారాయణ

15 జూన్‌ 1938
మరణం13 జనవరి 2021
హైదరాబాద్‌
జాతీయత భారతదేశం
వృత్తిపారిశ్రామికవేత్త
జీవిత భాగస్వామిహైమవతి
పిల్లలుశ్రీనివాస్‌, ప్రతాప్‌, సురేందర్‌, సూర్యకుమారి

జననం మార్చు

కుందా సత్యనారాయణ 15 జూన్‌ 1938లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, బస్వాపురం గ్రామంలో జన్మించాడు.

సురేంద్రపురి నిర్మాణం మార్చు

కుందా సత్యనారాయణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మూడో కుమారుడు సురేంద్రబాబు 1991లో మరణించాడు. ఆయన జ్ఞాపకార్థం 1998లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో 18 ఎకరాల స్థలం కొని ఆ ప్రాంతానికి సురేంద్రపురి ప్రాంగణంగా నామకరణం చేసి కాశీ నుంచి కన్యాకుమారి వరకు గల ఆలయాలన్నింటినీ ఒకే ప్రదేశంలో నిర్మించాడు. అక్టోబర్ 2008 లో ఈ ప్రాంగణానికి సందర్శకులను అనుమతించినప్పటికినీ, జనవరి 2009 లో పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 8, 2009న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణదత్ తివారీ ప్రారంభించాడు.

మరణం మార్చు

కుందా సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో 13 జనవరి 2021న మరణించాడు. ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.[1][2][3][4]

మూలాలు మార్చు

  1. Sakshi (13 January 2022). "'సురేంద్రపురి' కుందా సత్యనారాయణ కన్నుమూత". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  2. NTV (13 January 2022). "'సురేంద్ర పురి' కుందా సత్యనారాయణ కన్నుమూత". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  3. 10TV (13 January 2022). "సురేంద్రపురి కుందా సత్యనారాయణ కన్నుమూత | Kaladhamam Surendrapuri Kunda Satyanarayana died" (in telugu). Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Eenadu (13 January 2022). "'సురేంద్రపురి' వ్యవస్థాపకుడు కుందా సత్యనారాయణ కన్నుమూత". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.