కుమారీ శతకము
కుమారీ శతకము పక్కి వేంకట నరసింహ కవీంద్రుడు రచించారు.
కొన్ని పద్యాలుసవరించు
పరపురుషులన్నదమ్ములు
వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్
మరదండ్రు నత్తమామలు
దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!
కుమారీ! మగడు తప్ప పైమగ వారందరూ నీ అన్నదమ్ములుగా ఎంచుకో! నీ భర్త నీకు దేవుడనుకో! భర్త అక్కలూ, చెల్లెళ్ళూ నీ అక్కచెల్లెళ్ళుగా తలచుకో! నీ అత్త మామలను తల్లిదండ్రులుగా భావించి సమయానికి తగినట్లు వారిని సంరక్షణ చేస్తూ ఉండు.
పెనిమిటి వలదని చెప్పిన
పనియెన్నడు చేయరాదు బావలకెదుటన్
కనబడగరఅదు; కోపము
మనసున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!
కుమారీ! భర్త వద్దన్న పనియెప్పుడూ చెయ్యకూడదు. బావల యందు నిల్చునిగాని, కూర్చుండి గాని, మాటాడడం లాంటి పనులు చెయ్యవద్దు. ఎవరేమన్నా మనసులో కోపానిని చోటివ్వకూడదు. కోపం పాపపు పనులు చేయిస్తుంది. శాంతంగా మసలుతూ ఉండాలి