కేంద్రీయ విద్యాలయం

సెంట్రల్ స్కూల్ (ఆంగ్లం: Central School) అని పిలువబడే కేంద్రీయ విద్యాలయం భారత కేంద్ర ప్రభుత్వపు మానవ వనరుల అభివృద్ధి శాఖ ద్వారా స్వయం ప్రాతిపదికన నడుపబడే విద్యాలయం. 1965లో "సెంట్రల్ స్కూల్స్" అన్న పేరుతో సీబీఎస్సీకి అనుగుణంగా మొదలయ్యాయి. తరువాత కేంద్రీయ విద్యాలయ అని పేరు రూపాంతరం చేసారు. ప్రాథమికంగా ఈ విద్యాలయాలను భారత రక్షణా వ్యవస్థ, భారత ఆర్మీలో పనిచేసే సైనికుల పిల్లల కోసం నిర్మించారు. ఆర్మీ వారు సొంత విద్యాలయాలు నెలకొల్పాక కేంద్రీయ విద్యాలయాలను అన్ని కేంద్ర సంస్థలకు అందుబాటులో తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరచూ స్థానబదిలీ సమస్యను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను రూపొందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకే సిలబస్ ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనబడే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈ విద్యాలయాలను నడుపుతుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా 1085 కేంద్రీయ విద్యాలయాలున్నాయి. వాటిలో 1081 భారతదేశంలో ఉండగా, నాలుగు విదేశాల్లో ఉన్నాయి. 2010 నాటికి 10,30,654 విద్యార్థులు చదువుచుండగా, 49,286 ఉద్యోగులు పని చేస్తున్నారు.

కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్
KVS Headquarters at Katwaria Sarai, Delhi.jpg
ఢిల్లీ లోని కేంద్రీయ విద్యాలయ భవనం
సమాచారం
MottoTattvaṁ pūṣaṇa apāvr̥ṇu
స్థాపన15 డిసెంబర్ 1963
పాఠశాల పరీక్షల బోర్డుసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)
Authorityవిద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
కమీషనర్నిధి పాండే, IIS
Websitekvsangathan.nic.in

లోక్‌సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 245 మంది కలిసి ఏటా మొత్తం 7,880 మంది విద్యార్ధులకు కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా కింద అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. ప్రతి ఏటా ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయించేవారు. అయితే ఈ కోటాలో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. [1] ఈ నేపథ్యంలో ఈ విద్యాల‌యాల్లో విద్యార్థుల ప్ర‌వేశాల‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా కొన‌సాగుతూ వ‌స్తున్న ఎంపీల కోటాను కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ 2022 ఏప్రిల్ 13న రద్దుచేస్తూ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.[2]

మూలాలుసవరించు

  1. "కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-13. Retrieved 2022-04-13.
  2. "kendriya Vidyalayas: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు: కేంద్రం". EENADU. Retrieved 2022-04-13.

వెలుపలి లంకెలుసవరించు