కైలాస్‌ చౌదరీ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొదటిసారి ఎంపీగా ఎన్నికై  2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

కైలాష్ చౌదరి

వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
30 మే 2019 – ప్రస్తుతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు గజేంద్ర సింగ్ షెకావత్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
ముందు సోనా రామ్
నియోజకవర్గం బార్మర్

శాసనసభ్యుడు
పదవీ కాలం
2013–2018
ముందు సోనా రామ్
తరువాత హరీష్ చౌదరి
నియోజకవర్గం బేతు

రాజస్థాన్ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2013

వ్యక్తిగత వివరాలు

జననం (1973-09-20) 1973 సెప్టెంబరు 20 (వయసు 50)
బేతు, రాజస్థాన్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రూపొంన్ దేవి
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

కైలాష్ చౌదరి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2013లో రాజస్థాన్ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. కైలాష్ చౌదరి 2013లో జరిగిన రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బేతు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

కైలాష్ చౌదరి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బార్మార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచి 2019 మే నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

మూలాలు మార్చు

  1. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Lok Sabha (2019). "Kailash Choudhary". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  3. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.