కోట శ్రీనివాస్ పూజారి

కోట శ్రీనివాస్ పూజారి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు కర్ణాటక శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో బీసీ & సాంఘిక సంక్షేమ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

కోట శ్రీనివాస్ పూజారి

శాసనమండలి అధికారపక్ష నాయకుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 ఆగష్టు 2019
ముందు జయమాల

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021
ముందు బి.శ్రీరాములు

బీసీ సంక్షేమం శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
21 జనవరి 2021
ముందు బి.శ్రీరాములు

ముజరయి శాఖ మంత్రి
పదవీ కాలం
20 ఆగష్టు 2019 – 28 జులై 2021
ముందు పి. టి. పరమేశ్వర్ నాయక్
తరువాత శశికళ అన్నాసాహెబ్ జోలె
పదవీ కాలం
12 జులై 2012 – 13 మే 2013
ముందు జె . కృష్ణ పాలిమర్
తరువాత రుద్రాప్ప లామని

మత్స్య శాఖ మంత్రి
పదవీ కాలం
20 ఆగష్టు 2019 – 21 జనవరి 2021
ముందు వెంకట్రావు నాడగౌడ
తరువాత ఎస్. అంగార

ఓడరేవులు & లోతట్టు రవాణా
పదవీ కాలం
20 ఆగష్టు 2019 – 21 జనవరి 2021
ముందు ఆర్.బి. తిమ్మాపూర్
తరువాత ఎస్. అంగార
పదవీ కాలం
12 జులై 2012 – 13 మే 2013
ముందు జె. కృష్ణ పాలిమర్
తరువాత హెచ్. సి. మహాదేవప్ప

శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
2 జులై 2018 – 23 జులై 2019
ముందు కే.ఎస్. ఈశ్వరప్ప
తరువాత ఎస్. ఆర్. పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-11-15) 1959 నవంబరు 15 (వయసు 64)
కొతతట్టు
జాతీయత  భారతదేశం
నివాసం ఉడుపి, కర్ణాటక, భారతదేశం

రాజకీయ జీవితం మార్చు

కోట శ్రీనివాస్ పూజారి బీజేపీ లో సామాన్య కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసాడు. ఆయన కర్ణాటక శాసనమండలికి దక్షిణ కన్నడ స్థానిక సంస్థల కోటాలో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై 2010 జనవరి 6 నుండి 2016 జనవరి 4 వరకు శాసనమండలి సభ్యుడిగా పని చేసాడు. ఆయన 2012 జులై 12 నుండి 2013 మే 13 వరకు జగదీష్ శెట్టర్ మంత్రివర్గంలో ముజరయి, ఓడరేవులు & లోతట్టు రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు.

కోట శ్రీనివాస్ పూజారి 2015లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో రెండోసారి తిరిగి ఎన్నికయ్యాడు.[2] ఆయన బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో 2019 ఆగష్టు 20 నుండి వరకు 2021 జులై 28 వరకు ముజరయి శాఖ మంత్రిగా, 2019 ఆగష్టు 20 నుండి 2021 జనవరి 21 వరకు మత్స్య శాఖ మంత్రి మంత్రిగా పని చేసి, ఆ తరువాత 4 ఆగష్టు 2021 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో బీసీ & సాంఘిక సంక్షేమ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

కోట శ్రీనివాస్ పూజారి డిసెంబర్ 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మూడోసారి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2022 జనవరి 6 నుండి 2028 జనవరి 5 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నాడు.[4]

మూలాలు మార్చు

  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Kannadiga World (30 December 2015). "MLC elections: BJP candidate Kota Srinivas Poojary and Congress candidate Pratapchandra Shetty won". Retrieved 10 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  4. News Next (14 December 2021). "Karnataka MLC Election Result: Kota Srinivasa Poojary and Manjunatha Bhandari won in DK". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.