గంటా సాయిబులు ముస్లింలలోని ఒక సముదాయం. వీరు ఆంధ్రప్రదేశ్ లోని అన్నిప్రాంతాలలోనూ కానవస్తారు. బిక్షాటనను తమవృత్తిగా ఎంచుకొని జీవనం సాగించేవారు. చలికాలంలో హరిదాసుల్లాగా గంటాసాయిబులు వేకువజామున గంటవాయించుకుంటూ బిక్షాటన చేసేవారు. వీరికి సరైన విద్య, సాంఘిక శిక్షణలూ లేక పేదరికం, సామాజిక ఛీత్కారాలలోకంలో బ్రతికేవారు. ఇపుడిపుడే సమాజం వీరిపట్ల కళ్ళుతెరుస్తోంది. ఇన్నాళ్ళకు వీరి పేదరికాన్ని గుర్తించి బి.సి.ఇ. గ్రూపులో చేర్చారు.