గసగసాల కుటుంబము

గసగసాల కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము.[1]

ఈ కుటుంబము చిన్న కుటుంబము. దీనిలోని మొక్కలన్నియు గుల్మములే. పెద్ద చెట్లు లేవు. ఈ మొక్కలు కూడా మనదేశ మందు తక్కువయె. ఆకులు ఒంటరి చేరిక, కణువు పుచ్ఛములుండవు. పుష్పకోశపు తమ్మెలు గాని రక్షక పత్రములు గాని రెండును ఆకర్షణ పత్రములు. కింజల్కములు నాలుగు చొప్పున నుండును. అండాశయము 1 గది.

గసగసాలు మొక్క 2 మొ. 4 అడుగుల వరకు బెరుగును. కొమ్మలు విరిచిన తెల్లని పాలుగారును.

కుటుంబ లక్షణాలు మార్చు

  • ఆకులు: ఒంటరి చేరిక, లఘుపత్రములు. అండాకారము. తమ్మెలు గలవు కణుపు పుచ్చములు లేవు. తొడిమ పొట్టిది. అంచునందు రంపపు పండ్లు గలవు.
  • పుష్పమంజారి: కణుపు సందులందుండి మధ్యారంభ మంజరి. వృంతము పొడుగు పుష్పము పెద్దది. సంపూర్ణము సరాళము.
  • పుష్పకోశము: రెండు రక్షక పత్రములు. నీచము. ఆకు పచ్చగా నుండును.
  • దళవలయము: ఆకర్షణ పత్రములు 4 వరుసకు రెండు వంత్దున రెండు వరుసస్లు, అంచులు మడతలు మడస్తలుగా నున్నవి. వృంతాశ్రితము. తెలుపు రంగు కొన్ని ఎర్రగా నుండును.
  • కింజల్కములు: కాడలు వెడల్పుగా నుండును. వృంతాశ్రితము పుప్పొడి తిత్తులు 2 గదులు.
  • అండకోశము: ఆండాశయము ఉచ్ఛము. 1 గది అండములు పెక్కులు కుడ్యాశ్రితము కీలము లేదు. కీలాగ్రము గుండ్రము.

ముఖ్యమైన మొక్కలు మార్చు

బ్రహ్మదండి మార్చు

బ్రహ్మదండి సాధారణముగ అన్ని నేలలలోను పెరుగును. ఇదియును చిన్న మొక్కయె. గుల్మము.

  • ఆకులు: ఒంటరి చేరిక తొడిమ లేదు. పక్షి వైఖరి తమ్మెలు గలవు. చ్చేదితము. తెల్లని చారలు గలవు పత్రముల మీద ముండ్లున్నవి.
  • పుష్పమంజరి: కణుపు సందుల నుండి బయలు దేరును. పువ్వులు సరళము, సంపూర్ణము, పశుపు పచ్చని రంగు.
  • పుష్పకోశము: రక్షక పత్రములు రెండు నీచము ఆకుపచ్చ రంగు.
  • దళవలయము: 4 ఆకర్షణ పత్రము వృంతాశ్రితము పసుపు రంగు.
  • కింజల్కములు: అసంఖ్యములు వృంతాశ్రితము.
  • అండకోశము: అండాశయము ఉచ్చము 1 గది పెక్కు అండములు. కుడ్య సంయోగము కీలము పొట్టి కీలాగ్రము గుండ్రము.

గసగసాల మార్చు

ఈ కుటుంబములోని కెల్ల గసగసాల మొక్కయె మిక్కిలి యుపయోగమైనది. వీని పంట వలన జాల లాభము వచ్చును. గసగసాల కాయల నుండియే నల్లమందు చేయుదురు.

దీని పంట ఎక్కువగా హిందూస్థానమునందు గలదు. అచ్చట వరి కోసి కుప్పలు వేసిన తరువాత గసగసాలను జల్లుటకై దున్నుట ఆరంబించుదురు. పది దినములకొక మారు చొప్పును నెల పదునైదు దినముల వరకు దున్నుచుందురు. వరికి బనికి వచ్చు నేలలే దీనికి పనికి వచ్చును. ఇట్లు ఎరువు వేయుచు దున్నిన పిదప ఎనిమిదడుగుల పొడగుగను నాలడుగులు వెడల్పుగను మళ్ళు చేయుదురు. గసగసాలని ఒక రాత్రి నీళ్ళలో నాన బెట్టి ఈ మళ్ళలో జల్లుదురు. అవి వారము దినములకు మెలకెత్తును. 5..... 6 అంగుళము లెదిగిన తరువాత నీరసముగా నున్నవని తోచిన వానిని పెరికి వేయుట మంచిది. మరి కొంచ మెదిగిన తరువాత మొక్కలు మిక్కి దగ్గర దగ్గరగా నున్నవని తోచిన యెడల దీసి దూరముగా పాతెదరు. తరువాత, కాయలు కాచు వరకు అప్పుడప్పుడు నీరు పెట్టుండ వలెల్ను. ఈ మొక్కలు మూడు నెలలలోనె ఎదిగి పుపుష్పించును. మూదవ నాడు పువ్వుల రేకులను గోసి వేయుదురు. తరువాత పది దినములకు కాయలు పెద్దవగును.ఈ కాయలన నుండియే నల్ల మందు జేయుదురు. కాయలు గోసిన నాడో మరునాడో మధ్యాహ్నము వేళ కాయల నొక పనుముట్టుతో మనము అల్చిప్పతో మాడికాయ దీసినట్లు గీయుదురు. ( ఈ పని ముట్టు నాలుగు కత్తులను మిక్కిలి దగ్గర దగ్గరగాచేర్చి నట్లుండును) ఇట్లు గీసిన చారలలో నొక ద్రవము చేరును. ఈ ద్రవమును నొక పాత్రలోనికి చేర్చి నిలువ చేయుదురు. ఇదియే నల్లమందు.

దీనిలో మరియొక రసము గలిపి గాని కాయల పొప్పర వేసి గాని దగాచేయు చుందురు. కాని మరియొక తైలము గలిపినను నల్లమందు నిలువయుంచగ నుంచగ నన్య పదార్థము పోయి మంచిదే యగును. గసగసాల పంటయు నల్లమందు వ్యాపారమును చిర కాలమునుండి మన దేశమున జరుగు చుండెను. అప్పటి నుండియు చీనా దేశమున కెగుమతి యెక్కువాగా జేయుచున్నాము. బాబరు మొదలగు మొగలాయి చక్రవర్తుల కాలములో నల్ల మందు మీద పన్నున్నట్లు దెలియు వచ్చుట లేదు. డచ్చి, ప్రెంచి, ఇంగ్లీషు వారలు మన దేశానికి వర్తకమునకు వచ్చిన తరువాత, మన వర్తకుల వద్ద గొనుక్కొనుచు, ఎగుమతి చేసి కొను చుండిరి. మన వర్తకులు రైతులకు సొమ్ము పెట్టి బడి పెట్టి తామిచ్చిన సొమ్మునకు బదులుగా నల్లమందును గైకొనుచుండిరి. మిగిలిన నల్లమందులో ఏవోకలువుచు రైతులమ్ముకొను చుండిరి. వీరిట్లు కల్తి గల్పుట చేతను ధరలలో హెచ్చు తగ్గులు వచ్చుట చేతను, ఈ యల్లరి పడలేక ఈష్టు ఇండియా కంపెని వారు నల్లమందు వ్యాపారము తామె భరింప వలసిన వారైరి. వారను హేస్టింగును వేలముల పద్ధతి పెట్టెను. దాని మూలమున నొక వర్థకుడొక పొలమును 4 వేలకో 5 వేలకో వేలము పాడి పండించు పండించుమని. రైతులను బాధ పెట్టుచు వచ్చెను. కాని రైతునకు లాభమంతగా నుండమిచే నిర్లక్ష్యముచేయుచు వచ్చె, వ్యాపరము తగ్గెను. ఇట్టి బాధల తగ్గించుటకై ఎట్టకేలకు గవర్నమెంటు వారు నల్ల మందు వ్యాపారమంతయు దాము స్యయముగానే యంగీకరింప వలసిన వారైరి. నల్లమందుకు బ్రమత్తుని జేయు గుణము గలదు. నూనె మొదలగు కొన్ని పదార్థములతో దిన్నచో మరణమును సంభవించును. కనుక, మన శ్రేయస్సును గోరి గవర్నమెంటు వారీ నల్ల మందు నందరికంద నీయక దానిపై ఎక్కువ పన్ను విధించిరి. కాని నల్లమందు పై నెట్టి నిభందన లేకున్నను దాని నిష్టపడి తినువారు ఇంఘ్లాండు దేశములో మైమరచి త్రాగుచున్న యంత మంది యుండరని గొందరి నమ్మకము. ఏదేశమైనను మన మూలమున మన గవర్నమెంటు వారికి గలిగెడు లాభ నష్టముల నెరుంగుట మంచిది.

చైనా దేశస్థులిప్పుడు నల్లమందును నిషేధించుటచే మన వర్తకము తగ్గినది. అయినను ధరలెక్కువగనుండుట చే లాభము బాగుగనె వచ్చుచున్నది.

నల్లమందును గడుపునొప్పి విరేచనములు కట్టుటకు దస్రుచుగా వాడుదురు. దానికి నిత్ర యుపయోగములు కూడా గలవు. కొందరు సదా భోజనమునకు ముండు మాత్రగా వేసికొందురు. గసగసాలలో నీ మత్తును గలుగ జేయు గుణములేదు. వాని యందొక సువాసనయు గలదు. నల్ల మందు తీయని కాయలలోని గింజలు మంచివి. ఈ గింజలనుండి నూనె దీయుదురు. దీనిని వంటలో గూడ వాడుదురు. జిత్ర పటములు వ్రాయుట యందును బనికి వచ్చు చున్నది. గసగసాలను కొన్ని పిండి వంటలలోను తాంబూలము లోను గూడ వాడుదురు.

  • బ్రహ్మదండి: మొక్క ఎక్కడైనను బెరిగిన నూడబెరికి పారవేయు చున్నారు గాని దాని లాభము గమనించుట లేదు. దాని వాడుకయు నెందు చేతనో యంతగా లేదు. కాని గింజలనుండి తీసిన చమురు, తలుపులకును, బల్లలకును అన్ని చెక్కలకును మెరుపు దెచ్చును. చిత్ర పటములు వ్రాయుటలోను బనికి వచ్చును. కొందరు తల నొప్పిని కూడా బోగొట్టు నందురు. ఈ నూనె కడుపు నొప్పులు మొదలగు వానిని బోగొట్టును. దీని యాకుల రసము పుండ్లను మానుపును. నిజమైన బ్రహ్మదండి మొక్క వేరేయున్నదని కొందరు చెప్పు చున్నారు.

మూలాలు మార్చు

  1. వేమూరి, శ్రీనివాసరావు (1916). వృక్షశాస్త్రము. మద్రాసు: విజ్ఞాన చంద్రికా మండలి. p. 74. Retrieved 28 June 2016.