చిత్రాంగద

తూర్పు హిమాలయాలలోని మణిపురపు రాకుమారి, అర్జునుని భార్య.

చిత్రాంగద తూర్పు హిమాలయాలలోని మణిపురపు రాకుమారి, అర్జునుని భార్య. వీరికి బభృవాహనుడు అను కుమారుడు జన్మించాడు.[1]

చిత్రాంగద
చిత్రాంగద
చిత్రాంగదతో అర్జునుడు
సమాచారం
కుటుంబంచిత్రవాహన (తండ్రి), వసుంధర (తల్లి)
దాంపత్యభాగస్వామిఅర్జునుడు
పిల్లలుబభృవాహనుడు
బంధువులుపాండవులు (బావలు)
కుంతి (అత్త)

తొలి జీవితంసవరించు

మహాభారత కాలంలో మనలూర్ అనేది భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఒక రాజ్యం. దీనిని చిత్రవాహనుడు అనే రాజు పరిపాలించాడు. అతనికి చిత్రాంగద ఒక్కతే సంతానం. చిత్రవాహనుడికి వేరే వారసుడు లేనందున, చిత్రంగదకు యుద్ధంలో పరిపాలనలో శిక్షణ ఇచ్చాడు. ఆమె రాజ్య ప్రజలను రక్షించే నైపుణ్యాన్ని నేర్చుకుంది.[2]

వివాహంసవరించు

పాండవ రాజు అర్జునుడు, చిత్రాంగదను ఎలా కలిశాడో మహాభారతంలో వివరించబడలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిత్ర[3] నాటకంలో చిత్రాగదను మగ బట్టలు ధరించిన యోధురాలుగా చిత్రీకరించాడు.[4] అరణ్యవాసం చేసే సమయంలో మణిపుర రాజ్యాన్ని సందర్శించిన అర్జునుడు అందమైన చిత్రాంగద నిజాయితీ, ధైర్యం చూసి ఆమెతో ప్రేమలో పడ్డాడు.[2]

వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రిని సంప్రదించినప్పుడు, రాజు తన పూర్వీకుడు ప్రభంజన కథను చెప్పాడు. సంతానం లేని ప్రభంజన అనేక యజ్ఞాలు, యాగాలు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమై, తన జాతికి చెందిన ప్రతి వారసుడికి ఒక బిడ్డ పుట్టాలని వరం ఇచ్చాడు. కనుక చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురంలోనే ఉండి రాజ్యాన్ని పరిపాలించాలని చిత్రవాహనుడు పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు, చిత్రాంగదను వివాహం చేసుకొని అతను ఆమెతో మూడు సంవత్సరాలు ఉండిపోయాడు. చిత్రాంగద కొడుకుకు జన్మనిచ్చిన తరువాత అర్జునుడు తన సంచారాన్ని తిరిగి ప్రారంభించాడు.[5] తన తాత తదనంతరం మణిపురంను బభృవాహనుడు పాలించాడు.

తరువాతి జీవితంసవరించు

అర్జునుడు ఆమెను విడిచిపెట్టి హస్తినాపురానికి తిరిగి వస్తూ ఆమెను తన రాజ్యానికి తీసుకువెళతానని మాట ఇచ్చాడు. చిత్రాంగద తన కొడుకు పెంపకాన్ని చూసుకుంది. చిత్రాంగద, ఆమె రాజ్యం గురించి మహాభారతంలోని అనేక అధ్యాయాలలోప్రస్తావించలేదు. మరొక వైపు, పాండవులు చివరకు కౌరవులపై యుద్ధంలో విజయం సాధించారు. యుధిష్ఠిరుడు హస్తినాపురానికి రాజు అయ్యాడు. యుద్ధ సమయంలో తన సొంత బంధువులను చంపానన్న బాధతో అతని మనస్సు చంచలమైనది. ఋషుల సలహామేరకు అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించి, అలంకరించబడిన గుర్రాన్ని రాజ్యం అంతటా పంపించాడు. అది ఎక్కడైనా పోటీ పడకుండా పోతే, అ భూమిని రాజు స్వాధీనం చేసుకుంటాడు. గుర్రం బాధ్యత అర్జునుడు చూసుకుంటున్నాడు. గుర్రం దక్షిణం వైపు కదులుతుండగా, ఒక యువకుడు అర్జునుడిని అడ్డగించాడు. అర్జునుడు ఆ యువకుడి వివరాలు అడిగినప్పుడు, అతను ఆ భూమికి యువరాజునని, యుద్ధం చేయడానికి ఈ వివరాలు చాలని అంటాడు. భీకర యుద్ధం ప్రారంభమై, తనపై బాణాలు రావడం చూసి అర్జునుడు అశ్చర్యపోతాడు.

చివరకు యువకుడు వేసిన బాణంతో అర్జునుడు అపస్మారక స్థితిలోకి వెలుతాడు. ఆ క్షణం ఆ యువకుడు చిత్రాంగద కుమారుడని అర్జునుడు గ్రహిస్తాడు. ఈ సంఘటన గురించి విన్న చిత్రాంగద ఏడుస్తూ అక్కడికి వచ్చి, అర్జునుడిని చూస్తుంది. అర్జునుడి మరో భార్య ఉలూపి, చనిపోయిన మనుష్యులను తిరిగి బ్రతికించగల మృత్యసంజీవి (రాతి)తో అక్కడికి వచ్చి, అర్జునుడికి తన సొంత కొడుకు చేత చంపబడే శాపం ఉందని, ఈ సంఘటనతో అతను తన శాపం నుండి విముక్తి పొందాడని చిత్రాంగద, బబ్రువాహనులతో చెప్తుంది. అర్జునుడు మృత్యసంజీవితో మేల్కొని, తన భార్యలను కొడుకును చూశాడు. అర్జునుడు ఉలుపి, చిత్రాంగద, ఆమె కుమారుడు బబ్రువాహనులను హస్తినాపురానికి తీసుకువెళతాడు. అక్కడ చిత్రాంగద గాంధారి సేవకురాలిగా మారి, తన జీవితాన్ని గాంధారి సేవలో గడిపింది.[2]

పదవి విరమణసవరించు

కలియుగం ప్రారంభమైన తరువాత ద్రౌపదితోపాటు పాండవులు పదవీ విరమణ చేసి, వారి ఏకైక వారసుడు అర్జునుడి మనవడు పరిక్షిత్తుకు సింహాసనాన్ని అప్పగించారు. వారి వస్తువులు, సంబంధాలన్నింటినీ విడిచిపెట్టి తమ కుక్కలతో కలిసి హిమాలయాలకు తమ చివరి తీర్థయాత్ర చేసారు. చిత్రాంగద తన రాజ్యమైన మణిపురంకు తిరిగి వెళ్ళింది.[6]

చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Shastri Chitrao (1964), p. 213
  2. 2.0 2.1 2.2 Bhanu, Sharada (1997). Myths and Legends from India - Great Women. Chennai: Macmillan India Limited. pp. 7–9. ISBN 0-333-93076-2.
  3. Tagore, Rabindranath (2015). Chitra - A Play in One Act. Read Books Ltd. p. 1. ISBN 9781473374263.
  4. J. E. Luebering (ed.). The 100 Most Influential Writers of All Time. The Rosen Publishing Group, Inc. p. 242. ISBN 9781615300051.
  5. Ganguli (1883), Book I, Section 218
  6. Ganguli, Kisari Mohan (1883–1896). "SECTION 1". The Mahabharata: Book 17: Mahaprasthanika Parva. Internet Sacred Text Archive. Retrieved 26 June 2020.
మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  • సభా పర్వము  • వన పర్వము లేక అరణ్య పర్వము  • విరాట పర్వము  • ఉద్యోగ పర్వము  • భీష్మ పర్వము  • ద్రోణ పర్వము  • కర్ణ పర్వము  • శల్య పర్వము  • సౌప్తిక పర్వము  • స్త్రీ పర్వము  • శాంతి పర్వము  • అనుశాసనిక పర్వము  • అశ్వమేధ పర్వము  • ఆశ్రమవాస పర్వము  • మౌసల పర్వము  • మహాప్రస్ధానిక పర్వము  • స్వర్గారోహణ పర్వము  • హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటరాజు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి | సుధేష్ణ
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత