జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు.[1] భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపబడుతుంది.[2]

జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
రాజీవ్ గాంధీ
జరుపుకొనేవారుభారతదేశం
జరుపుకొనే రోజుమే 21
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

ప్రారంభం , చరిత్ర మార్చు

1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించాడు. ఆయన చనిపోయిన నాటినుండి విపి సింగ్ ప్రభుత్వం హయాంలో మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించబడింది.[3] శాంతి, సామరస్యం, మానవజాతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి కూడా ఈ రోజును జరుపుకుంటారు.

ఇతర వివరాలు మార్చు

  1. తీవ్రవాద చర్యలు రూపుమాపి, దేశప్రజలు సహజీవనంతో మెలగాలన్నది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దశ్యం.
  2. తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారిచే తీవ్రవాద వ్యతిరేక దినం ప్రతిజ్ఞ చేయిస్తారు.

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (20 May 2015). "ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
  2. విశాలాంధ్ర, ప్రకాశం (21 May 2011). "ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
  3. మన తెలంగాణ, సంపాదకీయం (21 May 2019). "అభివృద్ధికి అడ్డు ఉగ్రవాదం". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.