జింఖానా క్రికెట్ మైదానం

సికింద్రాబాద్‌లో ఉన్న క్రికెట్ మైదానం

జింఖానా క్రికెట్ మైదానం, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో ఉన్న క్రికెట్ మైదానం. ఇది నగరంలోని అతి ముఖ్యమైన మైదానం. ఎన్నో ఏళ్ళుగా హైదరాబాదీలకు వారసత్వంగా వస్తున్న చారిత్రక ప్రదేశమిది.

జింఖానా క్రికెట్ మైదానం
మైదాన సమాచారం
ప్రదేశంసికింద్రాబాద్, తెలంగాణ
స్థాపితం1928
సామర్థ్యం (కెపాసిటీ)n/a
ఎండ్‌ల పేర్లు
n/a
n/a
అంతర్జాతీయ సమాచారం
ఏకైక WODI1997 14 డిసెంబరు:
మూస:Country data ఇంగ్లాండ్ v మూస:Country data డెన్మార్క్
జట్టు సమాచారం
హైదరాబాదు క్రికెట్ టీం (1928-ప్రస్తుతం)
2015 25 ఆగస్టు, నాటికి

చరిత్ర మార్చు

1928లో హైదరాబాద్ క్రికెట్ క్లబ్, రాజా ధనరాజ్‌గిర్ ఎలెవన్ బెహ్రామ్-ఉద్-దోవ్లా టోర్నమెంట్‌ సమయంలో ఈ మైదానం ఏర్పాటుచేశారు.[1] 1931లో మైదానం మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను హైదరాబాద్, విజయనగ్రామ్ ఎలెవన్ మహారాజ్ కుమార్ మధ్య నిర్వహించింది.[2] 1997లో మైదానం ఇంగ్లండ్ ఉమెన్స్, డెన్మార్క్ ఉమెన్స్ మధ్య మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌ను నిర్వహించింది.[3][4]

ఇతర వివరాలు మార్చు

  1. ప్రతి ఏటా జనవరిలో ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ 3వ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో అంతర్జాతీయ కైట్, స్వీట్, స్నాక్స్ పెస్టివల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి సంప్రదాయక ఆటలను నిర్వహిస్తారు.
  2. అంతేకాకుండా నగరానికి చెందిన వందల మంది క్రీడాకారులు ఇక్కడికి వచ్చి క్రికెట్, ఫుట్ బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, టెన్నిస్, రోలర్ స్కేటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్ వంటి క్రీడలు ఆడుతారు.
  3. వేసవి సెలవుల్లో ఇక్కడికి చిన్నారులు వచ్చి పలు రకాల ఆటలు ఆడుకుంటారు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు