జువ్వాడి శ్రీదేవి

జువ్వాడి శ్రీదేవి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1]

జువ్వాడి శ్రీదేవి

తెలంగాణ హైకోర్టు అడిషినల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 జూలై 30 నుంచి 2017 నవంబర్‌

నిర్మల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు అడిషినల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 అక్టోబర్‌ నుంచి 2008 ఫిబ్రవరి

వ్యక్తిగత వివరాలు

జననం 1972
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు జువ్వాడి సూర్యారావు, భారతి
జీవిత భాగస్వామి కూచాడి శ్రీహరి రావు
సంతానం ఇద్దరు కూతుళ్లు

జననం, విద్యాభాస్యం మార్చు

జువ్వాడి శ్రీదేవి 1972లో జువ్వాడి సూర్యారావు, భారతి దంపతులకు జన్మించింది. ఆమె ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1997 అక్టోబర్‌ 31న హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది.[2]

వృత్తి జీవితం మార్చు

జువ్వాడి శ్రీదేవి హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని ప్రాక్టీస్ ప్రారంభించి 2004 అక్టోబర్‌ నుండి 2008 ఫిబ్రవరి వరకు ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టులో అడిషినల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేసింది. ఆమె తరువాత హైకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చాక 2014 జూలై 30 నుండి 2017 నవంబర్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా పని చేసింది. జువ్వాడి శ్రీదేవి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడిషినల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[5] జువ్వాడి శ్రీదేవి 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమా‌ణ‌స్వీ‌కారం చేసింది.[6]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (2 February 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. Eenadu (24 March 2022). "తపించారు.. సాధించారు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  3. TV9 Telugu (2 February 2022). "తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhra Jyothy (3 February 2022). "హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  5. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  6. Namasthe Telangana (24 March 2022). "హైకోర్టు నూతన న్యాయ‌మూ‌ర్తుల ప్రమా‌ణ‌స్వీ‌కారం". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.