జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్

భారతీయ దౌత్యవేత్త

జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్ ( 1936 జనవరి 8 – 2005 జనవరి 3) ఒక భారతీయ దౌత్యవేత్త, ఇతను విదేశాంగ కార్యదర్శిగా కూడా పనిచేశాడు.ఇతను మలయాళీ రచయిత మున్షి పరమ్ పిళ్ళై, రెట్నామాయి దేవి దంపతులకు అప్పటి మద్రాస్, బ్రిటిష్ ప్రెసిడెన్సీలో (ప్రస్తుతం చెన్నై) జన్మించాడు. ఇతను తన ప్రాథమిక విద్యను రాజస్థాన్, ఢిల్లీలో పూర్తిచేసాడు.1952 లో జాకీర్ హుస్సేన్ కళాశాల (ఢిల్లీ విశ్వవిద్యాలయం) నుంచి బి.ఎ. అనర్స్ డిగ్రీని ఫిలాసఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ విభాగంలో డిగ్రీ చేసాడు.తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ లా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్స్ పూర్తిచేసాడు.ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో డాక్టరల్ డిగ్రీని పూర్తిచేసాడు.ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, ఇప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో భాగం.జ్యోతింద్ర నాథ్ దీక్షిత్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో 1991 నుండి1994 వరకు భారతీయ దౌత్యవేత్తగా, విదేశాంగ కార్యదర్శిగా ఉన్నత అధికారి హోదాలలో పనిచేసాడు.జ్యోతింద్ర నాథ్ దీక్షిత్ మరణించే సమయంలో, ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారు (భారతదేశం) గా పనిచేసాడు పాకిస్తాన్, చైనా దేశాల వివాదాలలో జ్యోతింద్ర నాథ్ సంధానకర్తగా తన పాత్రను చురుకుగా వ్యవహరించాడు.

జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్
జాతీయ భద్రతా సలహాదారుగా 2004 మే 27 న విధుల స్వీకరించిన సందర్బంగా న్యూ డిల్లీలో తీసిన ఫైల్ ఫొటో
జననం
జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్

1936 జనవరి 8
మరణం2005 జనవరి 3
న్యూ డిల్లీ
మరణ కారణంగుండెపోటు
ఇతర పేర్లుజ్యోతింధ్ర నాథ్ దీక్షిత్
విద్యబి.ఎ. అనర్స్ డిగ్రీ (ఫిలాసఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్)
వృత్తిరచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత హైకమిషనర్
తల్లిదండ్రులుమున్షి పరమ్ పిళ్ళై
రెట్నామాయి దేవి

జీవిత గమనం మార్చు

అతను 1958 లో భారత విదేశాంగ శాఖలో చేరి, ఆస్ట్రియాలోని వియన్నాలో పనిచేశాడు.పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విముక్తి చెందిన తరువాత బంగ్లాదేశ్‌కు భారత డిప్యూటీ హై కమిషనర్‌గా 1971 నియమించబడి 1974 వరకు పనిచేసాడు. తదనంతరం అతను టోక్యో, వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయాల్లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేశాడు. తరువాత చిలీ, మెక్సికో దేశాలలో 1960 నుండి 1961 వరకు, జపాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో 1980 నుండి1985 వరకు రాయబారి (3 వ కార్యదర్శి) గా, శ్రీలంకలో 1985 నుండి1989 వరకు భారత హైకమిషనర్‌గా, పాకిస్తాన్, భూటాన్‌లో 1989 నుండి 1991 వరకు భారత సహాయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించాడు.[1]

తరువాత అతను 1991 నుండి భారత విదేశాంగ కార్యదర్శిగా పనిచేశాడు.1994 లో ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ పొందాడు.అతను UN, UNIDO, UNESCO, ILO, నాన్-అలైన్డ్ మూవ్మెంట్ (NAM) కు భారత ప్రతినిధిగా కూడా పనిచేశాడు. అతను మొదటి జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడుగా వ్యవహరించాడు. అతను అనేక పుస్తకాల రచించాడు.1987 లో భారతదేశం శ్రీలంక ప్రభుత్వంతో ఒక ఒప్పందంపై సంతకం చేసి, జాతి సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న ద్వీప దేశంలోని తమిళ ప్రాంతానికి భారత శాంతి పరిరక్షక దళాన్ని (ఐపికెఎఫ్) నియమించినప్పుడు అతను కొలంబోలో హై కమిషనర్‌గా కొనసాగాడు.

అతను 2004 లో జాతీయ భద్రతా సలహాదారు పదవికి విజయం సాధించాడు [2] అంతర్జాతీయ, ప్రాంతీయ వ్యవహారాలపై అవుట్ లుక్ (ఇండియన్ మేగజైన్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు ప్రచురణలలో క్రమం తప్పకుండా కనిపించేవి. అనేక విద్యా సంస్థలలో విజిటింగ్ లెక్చరర్‌గా కొనసాగాడు.[3]

వ్యక్తిగత జీవితం మార్చు

అతను విజయ లక్ష్మి దీక్షిత్ (నీ సుందరం) ను వివాహం చేసుకున్నాడు.వీరి సంతానం ఐదుగురు. అశోక్ దీక్షిత్ మందా దీక్షిత్ ను, రాహుల్ దీక్షిత్ రూప దీక్షిత్ ను, ఆభ దీక్షిత్ వి. బి (ఆనంద్) ధావ్లేను, దీపా దీక్షిత్ రాజీవ్ శక్తిధర్ వివాహం చేసుకున్నారు.ఐదవ సంతానం ధ్రువ్ దీక్షిత్. అతని మనవరాళ్ళు. సాగమిత్ర దీక్షిత్, సుమిరాన్, సాగిరి దీక్షిత్, జైదేవ్, అభిషేక్ ధావ్లే, వసుధా శక్తిధర్.ఇతను రెండవసారి వివాహం చేసుకున్నాడు. జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్ జాతీయ భద్రతా సలహాదారు హోదాలో పనిచేయుచూ మరణించిన మొదటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు.[4][5]

అవార్డులు. గౌరవాలు మార్చు

భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం, పద్మ విభూషణ్, 2005 లో జె ఎన్ దీక్షిత్ కు మరణానంతరం ప్రదానం చేశారు.

మరిన్ని విశేషాలు మార్చు

  • సెల్ఫ్ ఇన్ శరదృతువు, 1982 (కవితల సంకలనం)
  • అనాటమీ ఆఫ్ ఎ ఫ్లావ్డ్ ఇన్హెరిటెన్స్: ఎ సర్వే ఆఫ్ ఇండో-పాక్ రిలేషన్స్ 1970–94, కోనార్క్ పబ్లిషర్స్, 1995
  • నా సౌత్ బ్లాక్ ఇయర్స్, యుబిఎస్ పబ్లిషర్స్,
  • అసైన్‌మెంట్ కొలంబో, కోనార్క్ పబ్లిషర్స్, 1997.
  • అక్రోస్ బోర్డర్స్: ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇండియా ఫారిన్ పాలసీ, పికస్ పబ్లిషర్స్. 1998.
  • లిబరేషన్ అండ్ బియాండ్: ఇండో-బంగ్లాదేశ్ రిలేషన్స్ 1971–99, కోనార్క్ పబ్లిషర్స్. 1999.
  • యాన్ ఆఫ్ఘోమ్: డైరీ-జహీర్ షా టు తాలిబాన్, కోనార్క్ పబ్లిషర్స్, 2000.
  • ఇండియన్ ఫారిన్ పాలసీస్ అండ్ ఇట్స్ నైబర్స్, గయాన్ బుక్స్, న్యూడిల్లీ, 2001. ISBN 81-212-0726-6.
  • గయాన్ బుక్స్, 2003 చే భారతదేశ విదేశాంగ విధానం-ఛాలెంజ్ ఆఫ్ టెర్రరిజం, ఫ్యాషన్ ఇంటర్ స్టేట్ ఈక్వేషన్స్. ISBN 81-212-0785-1
  • బాహ్య వ్యవహారాలు. రోలీ బుక్స్, 2003. ISBN 81-7436-264-9.
  • ఇండియన్ ఫారిన్ సర్వీస్: హిస్టరీ అండ్ ఛాలెంజ్. కోనార్క్ పబ్లిషర్స్, 2005. ISBN 81-220-0694-9.

మరణం మార్చు

జె. ఎన్. దీక్షిత్ 2005 జనవరి 3 న న్యూ డిల్లీలో గుండెపోటుతో మరణించాడు.[1][4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Jyotindra Nath Dixit: Indian diplomat (1936 - 2005) | Biography, Bibliography, Facts, Information, Career, Wiki, Life".
  2. "JN Dixit Is NSA". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2004-05-27. Retrieved 2020-04-21.
  3. "diplomacy | Nature, Purpose, History, & Practice". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-04-21.
  4. 4.0 4.1 Jan 3, PTI |; 2005; Ist, 10:50 (3 January 2005). "National Security Advisor JN Dixit passes away | India News – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-21. {{cite news}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-11-06. Retrieved 2020-04-21.

వెలుపలి లంకెలు మార్చు