ప్రధాన మంత్రి భవనం (కొలంబో)
వేరొక పేరు టెంపుల్ ట్రీస్
నగరం కొలంబో
దేశము శ్రీలంక
అక్షాంశము 60 54 53 ఉత్తర
రేఖాంశం 790 51 07 తూర్పు

టెంపుల్ ట్రీస్ శ్రీలంక ప్రధానమంత్రి అధికారిక నివాస భవనము. ఇది కొలంబోలో ఉంది. ప్రస్తుతము ఇందులో శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స నివాసముంటున్నారు.

శ్రీలంక ప్రధాన మంత్రి విక్రమ సింఘే 2015 మే 2న అమెరికా సెక్రటరీ కెర్రీ తో టెంపుల్ ట్రీస్ కాంప్లెక్స్ లో సమావేశమైన దృశ్యం

చరిత్ర మార్చు

ఈ భవనంఉ చరిత్ర 19వ శతాబ్దము నుండి మొదలవుతుంది. బ్రిటీషు వారి కాలంలో ఇది వారి వాణిజ్య, పరిపాలనా భవనముగా ఉండేది. 1830 -1834 మధ్యకాలంలో శ్రీలంక సుగంధద్రవ్య బోర్డు అధ్యక్షుడిగా నియమింపబడిన బ్రిటీష్ అధికారి జాన్ వెల్బాఫ్ ఈ భవనమును తన ఆధీనంలో ఉంచుకున్నాడు. తరువాత ఇది ప్రముఖ వర్తకుడు, కొలంబో అబ్జర్వర్ మొదటి సంపాదకుడు జార్జ్ వింటర్ ఆధీనంలోకి వెళ్ళింది. 1856 లోఈ భవనాన్ని జాన్ ఫిలిప్ బ్రౌన్ కొన్నాడు. ఈ భనం చుట్టూ పెరిగిన దట్టమైన చెట్లను చూసి అతను దీనిని టెంపుల్ ట్రీస్ గా నామకరణం చేశాడు.[1] .కాలక్రమంలో దీనిని సిలోన్ బ్రిటీష్ గవర్నర్ జనరల్ కొని దీనిని తన నివాస భవనంగా మార్చుకొన్నాడు. 1948 నుండి ఇది శ్రీలంక ప్రధాన మంత్రి అధికార నివాసంగా ఉంది. దీనిలో నివసించిన మొదటి ప్రధానమంత్రిగా డాన్ స్టీఫెన్ సేనానాయకే చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.[2]

టెంపుల్ ట్రీస్ అనునది నవీన శ్రీలంక చరిత్రలో కేంద్ర భాగం.1962 లో మిలిటరీ ప్రయత్నాలలో భాగంగా ఉన్నత పోలీసు అధికారులు, మిలిటరీ అధికారులకు "టెంపుల్ ట్రీస్" అనునది ప్రధాన లక్ష్యముగా ఉండెడిది. ఈ భవనం చుట్టూ ఆవరించి ఉన్న యుద్ధ శకటాలను తొలగించి శ్రీలంక సైన్యం దీనిని తమ స్థావరంగా చేసుకున్నారు. ఈ చర్యను కొలంబో విశ్వవిద్యాలయం, సిలోన్ నావికాదళం నిరోధించాయి. 1971, ఏప్రిల్ 4న ఇది శ్రీలంక రాజకీయనాయకురాలు సిరిమావో బండారునాయకేకి శరణాలయంగా మారింది. ఆమెపై చేపట్టిన హత్యాయత్నం భగ్నమవడంతో ఆమె ఇక్కడ కొద్ది రోజులు తలదాచుకున్నారు. శ్రీలంక అంతర్గత తిరుగుబాటు కాలంలో మరికొందరు మంత్రులు కూడా ఇక్కడ తలదాచుకున్నారు. 1970 నుండి ఈ భవనానికి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ భవనానికి దారితీసే అనేక రహదారులను కూడా మూసివేశారు.

ఇవికూడాచూడండి మార్చు

మూలాలు మార్చు

  1. WINTER - Family
  2. The reel taste of golden memories The reel taste of golden memories,By Noel Crusz