తాపీ ధర్మారావు జీవితం-రచనలు
తాపీ ధర్మారావు జీవితం-రచనలు ఏటుకూరి ప్రసాద్ గారు తాపీ ధర్మారావు గురించి రచించిన సిద్ధాంత గ్రంథం.

విషయాలు సవరించు
తాపీ ధర్మారావు నాయుడు తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. ఆంధ్రులకొక మనవి, దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు?, పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు, రాలూ రప్పలువంటి పుస్తకాలు, సాహిత్యాంశాలపై సాహిత్య మొర్మొరాలు, పాతపాళీ, కొత్తపాళీ వంటి గ్రంథాలు, విజయవిలాస కావ్యంపై హృదయోల్లాస వ్యాఖ్య వంటివి ఆయన రచించారు. తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబరు 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నారు.[1] ఇది ఆయన జీవిత చరిత్ర. ఈ గ్రంథంలో ఆయన జీవితం గురించే కాక ఆయన రచించిన సాహిత్యం గురించి కూడా ఉంటుంది.
మూలాలు సవరించు
- ↑ ప్రజాశక్తి (19 September 2015). "జన మాధ్యమాలలో తెలుగు వినియోగం". www.prajasakti.com. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 19 September 2019.