శ్రీ జగన్నాథ్‌ ప్రొడక్షన్‌, పతాకాన 'తారుమారు' చిత్రాన్ని హాస్యప్రధానంగా దర్శక నిర్మాత ఎస్‌.జగన్నాథ్‌ రూపొందించారు. వేమూరి పరబ్రహ్మశాస్త్రి, హేమలత, కొడవటిగంటి, జె.శంకరం నటించిన ఈ చిత్రం నిడివి ఆరు రీళ్లు మాత్రమే. బాలాంత్రపు రజనీకాంతరావు సంగీత దర్శకత్వం వహించారు. కొడవటిగంటి కుటుంబరావు, ఓ ఇంగ్లీష్‌ కథ ఆధారం చేసుకుని 'తారుమారు' కథ, మాటలు, పాటలు రాశారు. తాయెత్తు ద్వారా వశీకరణ చేసుకోవాలని భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు ప్రయోగం చేయడం ఈ చిత్ర ఇతివృత్తం.[1]

తారుమారు
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.జగన్నాథ్
రచన కొడవటిగంటి కుటుంబరావు
తారాగణం వేమూరి పరబ్రహ్మశాస్త్రి,
డి.హేమలతాదేవి,
కొడవటిగంటి కుటుంబరావు,
జె.శంకరం
గీతరచన కొడవటిగంటి కుటుంబరావు
సంభాషణలు కొడవటిగంటి కుటుంబరావు
నిర్మాణ సంస్థ ‌జగన్నాథ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=తారుమారు&oldid=3687750" నుండి వెలికితీశారు