తూములూరు అనంత పద్మనాభయ్య

తూములూరు అనంత పద్మనాభయ్య, స్వాతంత్ర్య సమరయోధులు.[1] ఇతను నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గంగవరం గ్రామంలో జన్మించాడు. మహాత్మా గాంధీ పిలుపు విని పోలీస్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్య సమరంలో దూకి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఇతను తన ఆస్తిని మొత్తంగా దేశసేవకై వెచ్చించాడు. 1930 ఉప్పు సత్యాగ్రహం, 1931 శాసనోల్లంఘనోద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు.[2]

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ సంఘంలో ప్రముఖ పాత్ర వహించి, నెల్లూరు పట్టణ కాంగ్రెసుకు అధ్యక్షులుగా పనిచేశాడు. కారుణ్య భత్యం గ్రాంట్ దరఖాస్తును తిరస్కరించడమేకాక, నెల్లూరులో ట్రంక్కు రోడ్డులో, తిప్పరాజుసత్రం వద్ద గోడపత్రిక "నగరజ్యోతి"ని నెలకొల్పి, నిర్వహించాడు. తర్వాత ఇంద్రగంటి సుబ్రమణ్యం నగరజ్యోతి గోడపత్రికను తన జీవితాంతం కొనసాగించాడు.

మూలాలు మార్చు

  1. Naidu, Ch M. (1986-01-01). Salt Satyagraha in the Coastal Andhra. Mittal Publications.
  2. Dr. Rajendra Prasad : Correspondence and Select Documents, Vol. 2. Allied Publishers. ISBN 978-81-7023-149-3.

వెలుపలి లంకెలు మార్చు

  • విక్రమసింహపురి మండల సర్వస్వం, సంపాదకుడు: నేలనూతల శ్రీకృష్ణమూర్తి, నెల్లూరు జిల్లాపరిషత్తు ప్రచురణ,1964. 2.కాంగ్రెస్ సేవ, రచయిత :నేలటూరు పార్థసారథి ఇయ్యంగార్, నెల్లూరు.19947. 3.నెల్లూరు వారపత్రిక జమీన్ రైతు సంచికలు.