తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ
తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ అనేది తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు ఉపాధి అవకాశాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను దళారి వ్యాపారస్తుల నుంచి కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన ఈ గిరిజన సహకార సంస్థకు 2022 మార్చి 31న రమావత్ వాల్యానాయక్ చైర్మన్గా నియమితుడయ్యాడు.[1]
స్థాపన | 2014 |
---|---|
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | గిరిజనుల ఉపాధి |
కార్యస్థానం |
చరిత్ర సవరించు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్ధ (జిసిసి) ప్రారంభించబడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఏర్పాటయింది.
విధులు సవరించు
- గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం
- కొనుగోలు చేసిన అటవీ ఉత్పత్తులకు ‘బ్రాండింగ్’ కల్పించి, వాటిని మార్కెట్లో విక్రయిచడం
చైర్మన్లు సవరించు
- ధరావత్ గాంధీనాయక్ (2017 జూన్ 12 - 2022, మార్చి 30)[2]
- రమావత్ వాల్యానాయక్ (2022 మార్చి 31 - ప్రస్తుతం)
ఫలితాలు సవరించు
- 2018-19 సంవత్సరానికి 250 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యానికి 238 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధించింది.
- 2019-20 సంవత్సరానికి 400 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యానికి పెట్టుకోగా 2019 డిసెంబరు చివరి వరకే 200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది.[3]
మూలాలు సవరించు
- ↑ Andhra Jyothy (1 April 2022). "జీసీసీ చైర్మన్గా రమావత్ వల్యా నాయక్" (in ఇంగ్లీష్). Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
- ↑ telugu, NT News (2021-06-02). "ఉద్యమ బీజాలు…నేటి తేజాలు". Namasthe Telangana. Archived from the original on 2021-06-02. Retrieved 2022-04-01.
- ↑ "లక్ష్యాలను సాధించిన గిరిజన సహకార సంస్థ". andhrabhoomi.net. Archived from the original on 2020-09-20. Retrieved 2022-04-01.